- Home
- Life
- Luxury Trains: ఈ రైళ్ల ముందు.. విమానం కూడా దిగదుడుపే, 5స్టార్ హోటల్ భోజనం.. మన దేశంలో లగ్జరీ రైళ్లు ఇవే..!
Luxury Trains: ఈ రైళ్ల ముందు.. విమానం కూడా దిగదుడుపే, 5స్టార్ హోటల్ భోజనం.. మన దేశంలో లగ్జరీ రైళ్లు ఇవే..!
Luxury Trains: విమానాన్ని లగ్జరీ ట్రావెల్ గా భావిస్తాం. చాలా డబ్బులు ఉన్నవారు మాత్రమే విమానాలు ఎక్కుతారు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, ఈ రైళ్ల ముందు విమానం కూడా దిగదుడుపే..అలాంటి రైళ్లు ఇవే..

లగ్జరీ రైళ్లు.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిందే..
మీరు ఇప్పటి వరకు చాలా రైళ్లు ఎక్కే ఉంటారు. కానీ.. రైలు ఎక్కినప్పుడు ఆ సీట్లలో కూర్చోలేక.. చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. గంటల కొద్దీ ప్రయాణం చేయాలి.. ఇక.. ఆ సీట్ల నుంచి వచ్చే వేడి చాలా చిరాకుగా ఉంటుంది. రైలు ప్రయాణమే కష్టం అనుకుంటే.. ఇక.. ఆ ప్రయాణంలో సరైన ఫుడ్ దొరకదు. దొరికిన ఫుడ్ నచ్చినా, నచ్చకపోయినా తినేయాలి. కానీ.. విమానాలను తనదన్నేలా.. మీకు విలాసవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే రైళ్లు కూడా ఉన్నాయి అని మీకు తెలుసా? అది కూడా మన దేశంలోనే అని తెలుసా? మరి, మన దేశంలో లగ్జరీ రైళ్లు ఏవి? వాటిలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
మహారాజా ఎక్స్ ప్రెస్..
ప్రపంచంలో మోస్ట్ లగ్జరీ రైలు ఏది అనగానే మొదటి పేరు మహారాజా ఎక్స్ ప్రెస్. ఈ రైలు రాజస్థాన్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నార్త్-వెస్ట్ భారత్, మధ్య భారత దేశాల్లో దాదాపు 10 ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటిస్తుంది.ఈ రైలు చాలా లగ్జరీయస్ గా ఉంటుంది. మీరు ఈ రైలులో 5 స్టార్ హోటల్ లాంటి భోజనం రుచి చూస్తారు. ముఖ్యంగా రాచరికపు మర్యాదలన్నీ మీరు ఈ రైలులో అనుభవించగలరు.
ప్యాలెస్ ఆన్ వీల్స్..
మన దేశంలో మొట్టమొదటి లగ్జరీ రైలు ఈ ప్యాలెస్ ఆన్ వీల్స్. దీనిని 1982లో ప్రారంభించారు. ఇండియన్ రైల్వే, రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ ఈ రైలు ప్రారంభించారు. ఈ రైలు ఎక్కితే.. మీరు రాజుల కాలంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఈ రైలు మిమ్మల్ని న్యూ ఢిల్లీ, జైపూర్ సవాయి మాధోపూర్, ఆగ్రా వంటి ప్రముఖ నగరాల నుంచి తీసుకువెళ్తుంది. ఈ రైలులో సీట్లు.. మీకు నార్మల్ ట్రైన్ సీట్లలా ఉండవు. రాజుగారి దర్బారులా ఉంటాయి. లైఫ్ లో ఒక్కసారి అయినా ఇలాంటి రైలు ఎక్కాల్సిందే.
దక్కన్ ఒడిస్సీ..
మన దేశంలోని మరో లగ్జరీ రైలు ఈ దక్కన్ ఒడిస్సీ. ఇది కూడా అంతే మనకు రాజరికాన్ని పరిచయం చేస్తుంది. చాలా విలాసవంతంగా ఉంటుంది. ముంబయిలో స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ వరకు ప్రయాణిస్తుంది. దేశంలోని చాలా ప్రాంతాలను కవర్ చేస్తూ ఈ రైలు కదులుతుంది. ఈ రైలు ప్రయాణంలో.. మీరు రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి ప్రాంతాలను కవర్ చేస్తుంది. మీ ప్రయాణంలో పచ్చని పొలాలు, సుందరమైన గ్రామాలు చాలా కళ్లారా వీక్షించవచ్చు.
గోల్డెన్ ఛారియట్..
మరో లగ్జరీ రైలు ఈ గోల్డెన్ ఛారియట్. భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలన్నీ ఈ రైలు ప్రయాణంలో మనం చూడొచ్చు. ఈ రైలులో మొత్తం 11 కోచ్ లు ఉంటాయి.ఒక్కోదానికి ఒక్కో రాజవంశం పేరు ఉంటుంది. అత్యంత అందమైన ప్రదేశాలు అన్నింటినీ కవర్ చేస్తూ ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ఈ రైలులో ఫుడ్ కూడా అద్భుతంగా ఉంటుంది.

