MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Tips and Tricks: ఇదొక్కటి కలిపితే చాలు.. మీ బియ్యం, పప్పులకు పురుగులు పట్టవు..!

Tips and Tricks: ఇదొక్కటి కలిపితే చాలు.. మీ బియ్యం, పప్పులకు పురుగులు పట్టవు..!

మనం డబ్బాల్లో దాచిన పప్పులు, బియ్యం పై కీటకాలు, పురుగులు దాడి చేయడం మొదలుపెడతాయి. అందుకే, ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

2 Min read
ramya Sridhar
Published : Aug 06 2025, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బియ్యానికి పురుగులు పట్టాయా?
Image Credit : Getty

బియ్యానికి పురుగులు పట్టాయా?

వర్షాకాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.వాతావరణం ఇలా ఉన్నప్పుడు మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ, ఈ కాలంలో చాలా రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. కేవలం ఆరోగ్యం విషయంలో మాత్రమే కాదు... ఆహార పదార్థాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఈ కాలంలో వాతావరణంలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ కారణంగా.. చాలా రకాల ఆహార పదార్థాలు చెడిపోవడం మొదలౌతుంది. ముఖ్యంగా కీటకాల దాడి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం డబ్బాల్లో దాచిన పప్పులు, బియ్యం పై కీటకాలు, పురుగులు దాడి చేయడం మొదలుపెడతాయి. అందుకే, ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. మరి.. ఎంత కాలం అయినా.. బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

24
సింపుల్ చిట్కాలు..
Image Credit : stockPhoto

సింపుల్ చిట్కాలు..

వర్షాకాలంలో బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలలో కీటకాలు పుట్టుకువస్తాయి. ఒక్కసారి పురుగులు పడ్డాయంటే వాటిని తొలగిండచం అంత సులువేమీ కాదు. కానీ, మనం కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. చాలా మంది మార్కెట్లో దొరికే ఏవేవో పౌడర్లు తెచ్చి బియ్యం, పప్పుల్లో వేస్తూ ఉంటారు. కానీ.. అవి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. అవి లేకుండా..కూడా సహజంగా మనం ఈ పురుగులను తరిమికొట్టచ్చు.

Related Articles

Related image1
Food Tips: ఇలా చేశారంటే..కేవలం 15 నిమిషాల్లో కుక్కర్లో కొబ్బరిపాల అన్నం రెడీ!
Related image2
Rice Water Benefits: బియ్యం నీటిని పారేస్తున్నారా.. వాటితో ఊహించని ప్రయోజనాలు..
34
 వర్షాకాలంలో ఆహార ధాన్యాలు చెడిపోకుండా ఎలా కాపాడుకోవాలి?
Image Credit : Getty

వర్షాకాలంలో ఆహార ధాన్యాలు చెడిపోకుండా ఎలా కాపాడుకోవాలి?

వర్షాకాలంలో ధాన్యాలు చెడిపోకుండా, పురుగులు , కీటకాల నుండి కాపాడటానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం 10 రూపాయల విలువైన వస్తువు మీ సమస్యను పరిష్కరిస్తుంది. దీని కోసం, మీరు మార్కెట్ నుండి ముడి పసుపు ముద్దను తీసుకురావాలి. ఇప్పుడు ముడి పసుపును ఒక రోజు ఎండలో ఆరబెట్టండి, తద్వారా దాని తేమ బయటకు పోతుంది. తర్వాత మీరు ముడి పసుపు ముక్కలను కోయాలి. దీని తర్వాత, ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకొని దానిలో ఓ నాలుగు ముడి పసుపు ముక్కలను వేసి ఒక మూటలాగా కట్టాలి. ఈ మూటలను బియ్యం, గోధుమలు, పప్పుల డబ్బాలలో వేస్తే సరిపోతుంది. ఈ పసుపు వాసనకు బియ్యం, పప్పులకు పురుగులు పట్టవు. ఒకవేళ ఆల్రెడీ పురుగులు ఉన్నా కూడా..వాటి వాసనకు పారిపోతాయి.

44
ఇతర చిట్కాలు...
Image Credit : Instagram

ఇతర చిట్కాలు...

మీకు పసుపు అందుబాటులో లేకపోతే.. గళ్ల ఉప్పును బియ్యంలో కలిపినా కూడా మీకు పురుగుల బెడద ఉండదు. అయితే.. ఆ బియ్యాన్ని వాడే సమయంలో ఉప్పు మొత్తం కరిగిపోయే వరకు శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక.. బియ్యం, పప్పులను నిల్వ చేసే డబ్బాలను పొడిగా ఉండేలా చూసుకోవాలి. వాటికి పొరపాటున కూడా తేమ తగలనివ్వకూడదు. ఎండు మిరపకాయలను వేసినా కూడా పురుగులు పారిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved