Dosa Batter: పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా 30 నిమిషాల్లో దోశ పిండి రెడీ
Dosa Batter: దోశ పిండిని అప్పటిప్పుడు రెడీ చేసుకోవచ్చు. దీన్ని ముందు రాత్రంతా పులియబెట్టాల్సి అవసరం లేదు. కేవలం అరగంటలో కరకరలాడే దోశలు వేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ దోశె పిండి వైరల్ గా మారింది.
అప్పటికప్పుడు దోశె పిండి
అల్పాహారంలో దోశె అంటే ఎంతో ఇష్టంగా ఉంటారు. ఉదయం టిఫిన్ అయినా, రాత్రి డిన్నర్ అయినా వేడివేడి దోశ తినాలనిపిస్తుంది. ఇంట్లో పర్ఫెక్ట్గా దోశ చేయాలంటే బియ్యం, మినపప్పు నానబెట్టి, రుబ్బి, ఆ పిండిని 12 నుంచి 24 గంటల పాటు పులియబెట్టాలి. ఇదంతా చేయలేక చాలా మంది ఇంట్లో దోశెలు మానేసి బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుంటారు. అందుకే, పిండిని పులియబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడే దోశె ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే 'X'లో @JustPunforfun అనే యూజర్ దోశ పిండి రెసిపీని షేర్ చేశారు. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మీ వంటగదిలోనే సిద్ధంగా ఉంటాయి. బయటి నుంచి ఏమీ కొనాల్సిన పనిలేదు. ఈ పిండి త్వరగా రెడీ అవ్వడమే కాకుండా, దీనితో చేసే దోశలు క్రిస్సీగా వస్తాయి.
ఇన్స్టంట్ దోశ పిండి తయారు చేయడానికి ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు సామలు తీసుకోవాలి. అలాగే రెండు ఉడికించిన బంగాళదుంపలు, రెండు పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకులు, చిటికెడు ఇంగువ, ఒక చెంచా వాము, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి.
దోశె పిండి ఇలా చేసేయండి
దోశె పిండిని చేసేందుకు ముందుగా ముందుగా పెసరపప్పు, శనగపప్పు, సామ బియ్యం కలిపి నీటిలో కేవలం 30 నిమిషాలు నానబెట్టాలి. తరువాత శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో ఆ మూడింటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో తీసి వేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలను చేత్తోనే మెత్తగా మెదపాలి. వాటిని కూడా పిండిలో వేసి బాగా కలపాలి. అలాగే పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఇంగువ, వాము, ఉప్పు కలపాలి. అవసరమైనన్ని నీళ్లు పోసి పిండిని మెత్తగా మళ్లీ ఒకసారి రుబ్బుకోవాలి. పిండి దోశె పిండిలాగా జారుడుగా వచ్చాక పక్కన పెట్టుకోవాలి.
వేడి వేడి దోశెలు
స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి. గరిటెతో పిండిని పల్చగా వేయాలి. రెండు వైపులా కరకరలాడే వరకు కాల్చి, వేడివేడిగా సర్వ్ చేయాలి. దీన్ని పల్లి చట్నీ లేదా టమాటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

