PF Rules 2026 : పీఎఫ్ ఖాతాదారులకు డబుల్ జాక్పాట్..! ఇకపై నెలకు రూ.6,000 జమ
ఇకపై భవిష్య నిధి (PF) నిబంధనల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2026 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగుల జీతాలు, పొదుపుపై ఎలాంటి ప్రభావం ఉంటుందో వివరంగా చూద్దాం.

ఉద్యోగులకు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం వేతన పరిమితిని రూ.25,000కు పెంచాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్ 1, 2026 నుంచి వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరిమితి పెరిగితే లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగులు కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. ఉద్యోగి, సంస్థ వాటా కూడా పెరగడంతో రిటైర్మెంట్ నాటికి పొదుపు మొత్తం గణనీయంగా పెరుగుతుంది.
ఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆదాయపు పన్ను, పొదుపు నిబంధనలలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ ఏడాది నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి పీఎఫ్ వాటా రూ.2.5 లక్షలు దాటితే, ఆ అదనపు మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పరిమితి రూ.5 లక్షలుగా ఉంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం (New Tax Regime) డీఫాల్ట్గా ఉంటుంది. పాత విధానంలో పన్ను మినహాయింపులు కావాలనుకుంటే, ఆ విషయాన్ని మీ కంపెనీకి ముందుగానే తెలియజేయాలి.
ఆటోమెటిగ్గా పీఎఫ్ అకౌంట్ బదిలీ
ఉద్యోగం మారినప్పుడు పాత కంపెనీ పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీ ఖాతాకు ఆటోమేటిక్గా బదిలీ చేసే సదుపాయాన్ని మెరుగుపరిచారు. దీనివల్ల ఇకపై మాన్యువల్గా దరఖాస్తు చేసుకునే శ్రమ తగ్గుతుంది.
బేసిక్ జీతంలో 12% పీఎఫ్కు వెళ్తుంది కాబట్టి, ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది. అయితే మీ వాటా పెరగడం వల్ల చేతికి వచ్చే జీతం (Take-home salary) తగ్గే అవకాశం ఉంది. కానీ మీ సంస్థ వాటా కూడా పెరుగుతుంది కాబట్టి దీర్ఘకాలంలో ఇది మీకు ఎక్కువ లాభాన్ని ఇస్తుంది.
మీ ఖాతాలో ఆరువేలు.. ఎలాగో తెలుసా?
ఉదాహరణకు మీ జీతం రూ.25,000 అయితే దానిపై 12% పీఎఫ్ కట్ అవుతుంది. అంటే మీ వాటా రూ.3,000, మీ సంస్థ వాటా రూ.3,000 కలిపి మొత్తం రూ.6,000 మీ ఖాతాలో జమ అవుతుంది. ప్రస్తుతం ఈ మొత్తం గరిష్ఠంగా రూ.3,600 మాత్రమే ఉంది. సంస్థ వాటాలో కొంత భాగం పెన్షన్ పథకానికి వెళ్తుంది. వేతన పరిమితి పెరగడం వల్ల, రిటైర్మెంట్ తర్వాత మీకు లభించే నెలవారీ పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. అలాగే ఉచిత భీమా మొత్తం కూడా కొత్త పరిమితికి అనుగుణంగా పెరుగుతుంది.
పీఎఫ్ పెంపు
వ్యక్తుల ఆదాయాలు, నిత్యావసరాల ధరలు పెరిగినా పీఎఫ్ వేతన పరిమితి మాత్రం మారలేదు. దీంతో మధ్యతరగతి ఉద్యోగులు పీఎఫ్, పెన్షన్ ప్రయోజనాలను పూర్తిగా పొందలేకపోతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు నెలల్లోగా ఈ వేతన పరిమితిని మార్చాలని సుప్రీంకోర్టు ఇటీవల ఈపీఎఫ్ఓను ఆదేశించింది. అయితే ఈ పెంపుపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు.

