MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • EPFO: ఒక్క క్లిక్‌తోనే మీ PF సమాచారం మొత్తం లభిస్తుంది: ఏం చేయాలంటే..

EPFO: ఒక్క క్లిక్‌తోనే మీ PF సమాచారం మొత్తం లభిస్తుంది: ఏం చేయాలంటే..

EPFO తీసుకొచ్చిన మార్పులతో ఇప్పుడు PF బ్యాలెన్స్, డబ్బులు తీసుకోవడం, పెన్షన్ సమాచారం తెలుసుకోవడం చాలా సింపుల్. ఒక్క క్లిక్‌లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కూడా సులభం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1 Min read
Naga Surya Phani Kumar
Published : May 19 2025, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
EPFO కొత్త రూల్స్
Image Credit : Social media

EPFO కొత్త రూల్స్

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఇటీవల కొన్ని కీలక మార్పులు తీసుకువచ్చింది. 2025 సంవత్సరంలో అమలులోకి వచ్చిన ఈ కొత్త విధానాలతో దేశవ్యాప్తంగా 7 కోట్ల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా డిజిటల్ సేవలను మరింత ఈజీగా పొందే అవకాశం కల్పించారు.  

25
10 భాషల్లో సమాచారం
Image Credit : Social Media

10 భాషల్లో సమాచారం

ఈ మార్పుల ప్రకారం PF బ్యాలెన్స్ తనిఖీ, విత్‌డ్రా ప్రక్రియ, పెన్షన్ సమాచారం పొందడం ఇప్పుడు మరింత సులభంగా మారింది. EPFO సంబంధిత డేటాను ఒక్క క్లిక్‌తో పొందే వీలును కల్పించారు. మొబైల్ ఫోన్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. అదనంగా పది భాషల్లో సమాచారం అందుబాటులో ఉంటుంది.

Related Articles

Related image1
home business ideas: ఇంట్లో ఉండే ఇన్ని రకాల బిజినెస్‌లు చేయొచ్చా?
Related image2
Cars Under 5 Lakhs: రూ. 5 లక్షల లోపు వచ్చే బెస్ట్ కార్లు ఇవే!
35
కాల్ లేదా ఎస్ఎంఎస్ చేయండి
Image Credit : our own

కాల్ లేదా ఎస్ఎంఎస్ చేయండి

EPFO సేవలకు సంబంధించి మొత్తం సమాచారం ఇప్పుడు ఒక్క క్లిక్‌లో పొందవచ్చు. మీరు రిజస్టర్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా EPFO సేవలన్నింటికీ యాక్సెస్ కల్పించారు. మీ రిజస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 లేదా 011-22901406 నంబర్లకు మిస్డ్ కాల్ లేదా SMS పంపడం ద్వారా PF బ్యాలెన్స్, పెన్షన్ సమాచారం లభిస్తుంది.

45
ఉద్యోగులకు ప్రయోజనం కల్పించడానికే..
Image Credit : Twitter

ఉద్యోగులకు ప్రయోజనం కల్పించడానికే..

జనవరి 15, 2025 నుండి ఖాతా మార్పులు, వివరాల అప్‌డేట్ మొదలైనవి కంపెనీ లేదా యజమాని అనుమతి లేకుండానే చేసుకునే వీలు కూడా కల్పించారు. ఈ విధంగా EPFO డిజిటలైజేషన్‌తో ఉద్యోగులకి సేవల పరంగా పెద్ద ప్రయోజనం కలిగే మార్గం ఏర్పడింది. వేగంగా, సులభంగా, పారదర్శకంగా సేవలు అందించడమే ఈ కొత్త విధానాల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

55
మొబైల్ నంబర్ తో లింక్ చేసి ఉండాలి
Image Credit : our own

మొబైల్ నంబర్ తో లింక్ చేసి ఉండాలి

ఈ మార్పులు EPFO సేవల వినియోగాన్ని పెంచడమే కాకుండా ఉద్యోగుల సమయాన్ని ఆదా చేస్తాయి. దీంతో పీఎఫ్ సమాచారం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. 

గమనిక: ఈ సేవలు మీరు వినియోగించుకోవాలంటే ఉద్యోగుల EPFO అకౌంట్ కు తమ ఆధార్, మొబైల్ నంబర్‌తో లింక్ చేసి ఉంచుకోవాలి. ఇలా చేసిన వాటికే ఈ సేవలు అందుతాయి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved