- Home
- Jobs
- Bank Jobs
- Attractive Jobs: చేస్తే గీస్తే... ఈ కంపెనీలోనే ఉద్యోగం చేయాలబ్బా. దేశంలో అత్యంత ఆకర్షణీయ సంస్థ ఏంటో తెలుసా?
Attractive Jobs: చేస్తే గీస్తే... ఈ కంపెనీలోనే ఉద్యోగం చేయాలబ్బా. దేశంలో అత్యంత ఆకర్షణీయ సంస్థ ఏంటో తెలుసా?
చదువు పూర్తికాగానే ప్రతీ ఒక్కరూ ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఉంటారు. అయితే ఒకప్పటిలా కేవలం జీతం కోసమే కాకుండా తమ అభిరుచులకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. తమకు నచ్చిన చోటే పనిచేయడానికి ఇష్టపడుతున్నారు.

టాప్ 10 బ్రాండ్ ఎంప్లాయర్ల జాబితా
రాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2025 (REBR 2025) నివేదిక ప్రకారం భారత్లో అత్యంత ఆకర్షణీయమైన సంస్థల జాబితాను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం టాటా గ్రూప్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. టాటా గ్రూప్ ఆర్థిక స్థితి, ఉద్యోగ అభివృద్ధి అవకాశాలు, ఖ్యాతి వంటి అంశాల్లో అత్యధిక స్కోరు సాధించింది.
ఇతర సంస్థలు ఏంటంటే.?
ఈ జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏకైక మల్టీనేషనల్ ప్రభుత్వ రంగ బ్యాంకుగా స్థానం దక్కించుకుంది. టాప్ 10లో ఉండే ఇతర సంస్థల్లో సామ్సంగ్ ఇండియా, జేపీ మోర్గాన్, IBM, విప్రో, రిలయన్స్, డెల్ టెక్నాలజీస్ ఉన్నాయి.
రిపోర్ట్లో ఏం తెలిందంటే.?
సంస్థల రిప్యుటేషన్, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాల పట్ల ఉద్యోగులు మంచి అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ... వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ఆకర్షణీయ జీతాలు, బెనిఫిట్స్ వంటి అంశాల్లో సంస్థలు మరింత మెరుగయ్యే అవసరం ఉందని రిపోర్ట్ స్పష్టం చేసింది.
ఉద్యోగం మారాలనే ఆలోచన పెరుగుతోంది
ఈ అధ్యయనంలో భారత్లో 47% మంది ఉద్యోగులు 2025 మొదటి అర్ధభాగంలో ఉద్యోగం మార్చాలని భావిస్తున్నట్లు వెల్లడైంది. Gen Zలో 51%, మిల్లెనియల్స్లో 50% మంది కొత్త ఉద్యోగాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇది సంస్థలకు హెచ్చరిక అని చెబుతూ, ఉద్యోగుల నిబద్ధత, పారదర్శకత, ప్రయోజనాలపై ఆధారపడి కల్చర్ను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని వెల్లడించారు.
AI, నైపుణ్యాభివృద్ధి కీలకం
భారత ఉద్యోగులలో 61% మంది ఎఐ (AI) సాధనాలను రెగ్యులర్గా వాడుతున్నట్టు రిపోర్ట్ చెబుతోంది. మిలేనియల్స్ ఈ మార్పుకు ముందుండగా, గత ఏడాదితో పోలిస్తే వారి వినియోగం 13% పెరిగిందట. మరోవైపు, 90% మంది ఉద్యోగులు స్కిల్స్ను అప్డేట్ చేసే అవకాశం కల్పించే సంస్థలకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
రాండ్స్టాడ్ ఇండియా ఎండీ, సీఈఓ విశ్వనాథ్ పీఎస్ ఈ విషయమై మాట్లాడుతూ.. “ఇప్పటి ఉద్యోగులు సంపాదనకే పరిమితం కావడం లేదు. వారు పరస్పర విశ్వాసం, ఫ్రీడమ్ వంటి ప్రయోజనాలతో కూడిన సంస్థలను కోరుకుంటున్నారు. ఉద్యోగ మార్పు జోరు పెరుగుతోందని, సంస్థలు ఇక న్యాయమైన వర్క్ కల్చర్ ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని” తెలిపారు.