MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • World’s Most Dangerous Island : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవి.. వెళ్తే ప్రాణాలు గల్లంతే !

World’s Most Dangerous Island : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవి.. వెళ్తే ప్రాణాలు గల్లంతే !

World’s Most Dangerous Island : ఇటలీలోని పోవెగ్లియా దీవి ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశం. లక్షకు పైగా శవాలు పాతిపెట్టిన ఈ దీవిలో ఇప్పటికీ అరుపులు వినిపిస్తాయని ప్రచారం. ఇక్కడికి వెళ్లడాన్ని ప్రభుత్వం నిషేధించింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 27 2026, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ దీవికి వెళ్తే తిరిగిరారు.. ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది?
Image Credit : Gemini

ఈ దీవికి వెళ్తే తిరిగిరారు.. ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది?

ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే మనుషులు అడుగు పెట్టడానికి భయపడే ప్రమాదకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇటలీలోని వెనిస్ నగరాన్ని ఆనుకుని ఉన్న పోవెగ్లియా (Poveglia) దీవి ఒకటి. వెనిస్ అనగానే అందమైన కాలువలు, పడవ ప్రయాణాలు గుర్తొస్తాయి. కానీ వెనిస్ అఖాతంలో దాగి ఉన్న ఈ చిన్న దీవి మాత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, భయానకమైన ప్రదేశంగా పేరుగాంచింది.

ఈ దీవి చరిత్ర చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ జరిగిన మరణాలు, విషాద సంఘటనల కారణంగా స్థానికులు దీనిని మృత్యు దీవి, దెయ్యాల దీవి అని పిలుస్తారు. పర్యాటకులు ఇక్కడికి రావడానికి సాహసించరు. ఈ దీవిలో అడుగుపెడితే ఆత్మలు పట్టుకుంటాయని, వింత శబ్దాలు వినిపిస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఒకప్పుడు దాదాపు లక్షకు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టారని చరిత్ర చెబుతోంది. పోవెగ్లియా దీవి వెనుక ఉన్న ఆ భయానక విషయాలు గమనిస్తే..

26
ఆశ్రయం నుండి ఆక్రందనల వరకు: పోవెగ్లియా చరిత్ర ఇదే
Image Credit : Gemini

ఆశ్రయం నుండి ఆక్రందనల వరకు: పోవెగ్లియా చరిత్ర ఇదే

పోవెగ్లియా దీవి చరిత్ర 421 AD నాటిది. ఆ కాలంలో బార్బేరియన్ ఆక్రమణదారుల దాడుల నుండి తప్పించుకోవడానికి పాడవా, ఎస్టే నగరాల ప్రజలు ఇక్కడికి వచ్చి తలదాచుకున్నారు. అలా ఇది మొదట శరణార్థులకు ఒక సురక్షిత ప్రాంతంగా మారింది. శతాబ్దాల పాటు ఇది ప్రశాంతంగానే ఉంది. ఆ తర్వాత కాలంలో దీని స్వరూపం మారుతూ వచ్చింది. కొంతకాలం వ్యవసాయ భూమిగా, మరికొంత కాలం సైనిక స్థావరంగా దీనిని ఉపయోగించారు. అయితే 18వ శతాబ్దం చివరలో ఈ దీవి చరిత్ర ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు మనుషులకు ఆశ్రయం ఇచ్చిన ఈ నేల.. ఆక్రందనలకు నిలయంగా మారింది.

Related Articles

Related image1
Mystery Of The Pyramids : అబ్బబ్బా.. ఏం కట్టార్రా బాబు ! పిరమిడ్ మిస్టరీ సీక్రెట్ ఇదే
Related image2
World’s Longest Bridge : ప్రపంచంలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదే.. దీని పొడవు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
36
ప్లేగు మహమ్మారికి కేంద్ర బిందువు
Image Credit : Gemini

ప్లేగు మహమ్మారికి కేంద్ర బిందువు

18వ శతాబ్దంలో బ్యుబోనిక్ ప్లేగు వ్యాధి యూరప్ ఖండం మొత్తాన్ని వణికించింది. ఆ సమయంలో వెనిస్ ప్రభుత్వం ఈ పోవెగ్లియా దీవిని ప్లేగు బాధితులకు క్వారంటైన్ కేంద్రంగా మార్చింది. 1793 నుంచి కొన్ని దశాబ్దాల పాటు సముద్ర మార్గంలో వచ్చే నౌకల్లోని అనుమానిత రోగులను ఇక్కడే నిర్బంధించేవారు. వ్యాధి సోకిన వారిని కుటుంబాల నుండి వేరు చేసి ఈ దీవికి తరలించేవారు. ఇది ఒక రకంగా మరణ శిబిరంగా మారింది.

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తీసుకొచ్చారు. వారిలో అత్యధికులు ఇక్కడే ప్రాణాలు విడిచారు. మృతదేహాల సంఖ్య పెరిగిపోవడంతో వాటిని సామూహిక గుంతల్లో పడేశారు. మరికొందరిని తగలబెట్టారు. అంచనాల ప్రకారం.. ఆ సమయంలో దాదాపు 1 లక్షకు పైగా ప్రజలు ఈ చిన్న దీవిలో మరణించారు. ఇక్కడి మట్టి మనుషుల బూడిద, ఎముకలతో నిండిపోయిందని చెబుతారు.

46
మానసిక ఆసుపత్రిలో క్రూరమైన ప్రయోగాలు
Image Credit : Gemini

మానసిక ఆసుపత్రిలో క్రూరమైన ప్రయోగాలు

ప్లేగు కాలం ముగిసిన తర్వాత కూడా ఈ దీవికి శాంతి దొరకలేదు. 20వ శతాబ్దం ఆరంభంలో, అంటే సుమారు 1922లో ఈ దీవిలో ఒక మానసిక చికిత్సాలయం ఏర్పాటు చేశారు. మానసిక స్థితి సరిగా లేని రోగులను ఇక్కడికి తరలించేవారు. అయితే, ఆసుపత్రిలో రోగులకు చికిత్స కంటే చిత్రహింసలే ఎక్కువగా ఉండేవని పుకార్లు ఉన్నాయి.

అక్కడి వైద్యులు రోగులపై క్రూరమైన ప్రయోగాలు చేసేవారని చెబుతారు. ముఖ్యంగా మత్తుమందు ఇవ్వకుండానే మెదడుకు సంబంధించిన లోబోటమీ వంటి శస్త్రచికిత్సలు నిర్వహించేవారని సమాచారం. రోగులు తమకు ప్లేగుతో చనిపోయిన వారి ఆత్మలు కనిపిస్తున్నాయని చెప్పినా, వైద్యులు వాటిని పట్టించుకునేవారు కాదు.

56
డాక్టర్ ఆత్మహత్య.. మిస్టరీగా మిగిలిన మరణం
Image Credit : Gemini

డాక్టర్ ఆత్మహత్య.. మిస్టరీగా మిగిలిన మరణం

ఈ ఆసుపత్రికి సంబంధించిన ఒక ప్రధాన వైద్యుడి గురించి భయంకరమైన కథ ప్రచారంలో ఉంది. ఆ డాక్టర్ రోగుల పట్ల అత్యంత నిర్దయగా వ్యవహరించేవాడు. అయితే కొన్నాళ్లకు అతను కూడా పిచ్చివాడిగా మారిపోయాడు. ప్లేగుతో చనిపోయిన వారి ఆత్మలు తనను వెంటాడుతున్నాయని అతను భయపడేవాడు.

చివరకు ఆ బాధ భరించలేక అతను అక్కడి గంట స్తంభం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు. అయితే, అతను స్వయంగా దూకలేదని, దెయ్యాలే అతన్ని కిందకు నెట్టేశాయని కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అతను కిందపడినా చనిపోలేదని, ఆ తర్వాత భూమిలో నుంచి వచ్చిన పొగమంచు అతన్ని ఊపిరాడకుండా చేసి చంపిందని స్థానికంగా ప్రచారంలో ఉంది.

66
ప్రస్తుతం నిషేధిత ప్రాంతంగా మారిన పోవెగ్లియా దీవి
Image Credit : Gemini

ప్రస్తుతం నిషేధిత ప్రాంతంగా మారిన పోవెగ్లియా దీవి

ప్రస్తుతం పోవెగ్లియా దీవి పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. ఆనాటి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆసుపత్రి గదులు, తుప్పు పట్టిన వైద్య పరికరాలు, అడవిలా పెరిగిన చెట్లు మాత్రమే అక్కడ మిగిలాయి. ఇటలీ ప్రభుత్వం దీనిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. ప్రత్యేక అనుమతి లేకుండా ఎవరూ ఇక్కడికి వెళ్లకూడదు.

అయితే, కొందరు పారానార్మల్ నిపుణులు, సాహస యాత్రికులు ఇక్కడికి రహస్యంగా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ తమకు వింత అనుభవాలు ఎదురయ్యాయని వారు పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న గంట స్తంభం నుండి గంటల శబ్దాలు వినిపిస్తాయని, చీకటి పడితే ప్లేగు మాస్కులు ధరించిన వారు కనిపిస్తారనీ, ఆర్తనాదాలు వినిపిస్తాయని వారు చెబుతుంటారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రపంచం
విద్య
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Treasure: త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డ్డ భారీ నిధి.. రూ. 8 ల‌క్ష‌ల కోట్ల విలువైన బంగారం. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Mystery Of The Pyramids : అబ్బబ్బా.. ఏం కట్టార్రా బాబు ! పిరమిడ్ మిస్టరీ సీక్రెట్ ఇదే
Recommended image3
World’s Longest Bridge : ప్రపంచంలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదే.. దీని పొడవు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
Related Stories
Recommended image1
Mystery Of The Pyramids : అబ్బబ్బా.. ఏం కట్టార్రా బాబు ! పిరమిడ్ మిస్టరీ సీక్రెట్ ఇదే
Recommended image2
World’s Longest Bridge : ప్రపంచంలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదే.. దీని పొడవు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved