MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • బంగ్లాదేశ్‌లో పేట్రేగిన మతోన్మాదులు.. మరో హిందూ నేత హత్య: రంగంలోకి దిగిన అమెరికా!

బంగ్లాదేశ్‌లో పేట్రేగిన మతోన్మాదులు.. మరో హిందూ నేత హత్య: రంగంలోకి దిగిన అమెరికా!

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ హిందూ నేత భాబేష్ చంద్ర రాయ్‌ను అతివాద ముస్లింలు కొందరు కొట్టి చంపారు. దీనిపై భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం దీన్ని తీవ్రంగా ఖండించింది. ఆ దేశానికి వెళ్లవద్దంటూ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. 

1 Min read
Author : Anuradha B
Published : Apr 20 2025, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మతోన్మాదుల దాడి

మతోన్మాదుల దాడి

బంగ్లాదేశ్‌లో గత గురువారం 58 ఏళ్ల హిందూ నేత భాబేష్ రాయ్‌ను ఇస్లామిక్ మతతత్వవాదుల గుంపు కొట్టి చంపింది. భాబేష్ రాయ్ బంగ్లాదేశ్ పూజా ఉద్యపన్ పరిషత్ బీరల్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్. హిందూ సమాజంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఢాకా నుండి 330 కి.మీ దూరంలో ఉన్న దినాజ్‌పూర్‌లోని బసుదేవ్‌పూర్ గ్రామానికి చెందిన భాబేష్ చంద్ర రాయ్ భార్య శాంతన ప్రకారం, గురువారం నలుగురు వ్యక్తులు బైక్‌పై వచ్చి తన భర్తను ఎత్తుకెళ్లారు. భాబేష్ చంద్ర రాయ్‌ను నరబాడి గ్రామానికి తీసుకెళ్లి అక్కడ క్రూరంగా కొట్టారు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు.

24
అమెరికా ఆగ్రహం

అమెరికా ఆగ్రహం

బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనారిటీలపై ఇలాంటి దాడులను అరికట్టాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. తన పౌరుల భద్రత దృష్ట్యా హెచ్చరిక జారీ చేసింది. బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. బంగ్లాదేశ్‌లో మత ఘర్షణలు, ఉగ్రవాదం, అపహరణ వంటి నేరాలు తారస్థాయిలో ఉన్నాయని అమెరికా తన పౌరులకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత వరకు అక్కడికి వెళ్లవద్దని సూచించింది.

34
32 మంది హిందువుల హత్య

32 మంది హిందువుల హత్య

బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు అణచివేతకు నిదర్శనమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. హత్య తర్వాత కూడా నిందితులు శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆక్షేపించింది. గత ఏడాది ఆగస్టు నుండి డిసెంబర్ 2024 వరకు అక్కడ 32 మంది హిందువులు హత్యకు గురయ్యారు.

44

ఈ సంఘటన అనంతరం నిరసనలు వెల్లువెత్తడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి ఒక ప్రకటన చేశారు. బెంగాల్‌లో మైనారిటీ ముస్లింలను రక్షించాలని భారత్‌కు సూచించారు. పశ్చిమ బెంగాల్‌లో హింసను రెచ్చగొట్టడంలో బంగ్లాదేశ్ పాత్ర ఉందన్న వాదనను యూనస్ ప్రెస్ కార్యదర్శి ఖండించారు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Neal Katyal : ట్రంప్ కే చుక్కలు చూపిస్తున్న భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్..?
Recommended image2
US Tariffs : ట్రంప్ టారీఫ్స్ కు సుప్రీం బ్రేక్ .. అమెరికా అధ్యక్షుడి పవర్ ఈ చట్టంముందు తుస్సుమందిగా..!
Recommended image3
Bangladesh Cabinet : బంగ్లాదేశ్ కేబినెట్‌లో హిందూ మంత్రి.. ఎవరీ గయేశ్వర్ చంద్ర రాయ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved