ఎండు లేదా నానబెట్టిన ఖర్జూరాలు.. రెండింటిలో ఇవి తింటేనే మంచిది
కొంతమంది ఖర్జూరాలను అలాగే తినేస్తుంటే.. మరికొొంతమంది మాత్రం వాటిని నానబెట్టి తింటుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వీటిని ఎలా తింటే మంచిదంటే?

ఖర్జూరాలు
ఖర్జూరాలు టేస్టీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. వీటిని రోజుకు నాలుగైదు తింటే ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే వీటిని అలాగే తినడం మంచిదా? లేక నానబెట్టి తినడం మంచిదా? అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. మరి వీటిని ఎలా తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఖర్జూరాల ప్రయోజనాలు
ఖర్జూరాల్లో నేచురల్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. వీటిని తింటే మన శరీరానికి మంచి శక్తి అందుతుంది. అలసట ఉండదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బలహీనంగా ఉండే వారు ఎండు ఖర్జూరాన్ని తినడం మంచిది. ఎందుకంటే వీటిలో ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా చేస్తాయి. ఒంట్లో రక్తం పెరగడానికి సహాయపడతాయి. అలాగని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
నానబెట్టిన ఖర్జూరాలు
- ఖర్జూరాలను పాలలో లేదా నీళ్లలో నానబెట్టి తింటే అవి తొందరగా అరుగుతాయి.
- ఎండు ఖర్జూరాల్లో కంటే నానబెట్టిన ఖర్జూరాల్లో షుగర్ తక్కువగా ఉంటుంది. వీటిని షుగర్ పేషెంట్లు తినొచ్చు. కానీ ఎక్కువ మాత్రం తినకూడదు.
నానబెట్టిన ఖర్జూరాలు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. వీటిని తింటే మలబద్దకం సమస్య తగ్గుతుంది.
- రెగ్యులర్ గా పరిగడుపున 4 నానబెట్టిన ఖర్జూరాలను తింటే శరీరంలో పోషకాల లోపం పోతుంది. అలాగే శరీరం ఆహారం నుంచి మరింత సమర్థవంతంగా పోషకాలను గ్రహిస్తుంది.
- ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎసిడిటీ, మలబద్దకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి నానబెట్టిన ఖర్జూరాలే మంచివి.
ఏ ఖర్జూరాలు మంచివి?
ఎండు ఖర్జూరాలు, నానబెట్టిన ఖర్జూరాలు రెండూ మంచివే. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిలో ఏది తినాలనేది మీ ఆరోగ్యం, మీ శరీర అవసరాలను బట్టి నిర్ణయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ శరీరం శక్తివంతంగా, వెచ్చగా ఉండాలంటే ఎండు ఖర్జూరాలను తినొచ్చు. జీర్ణక్రియ కోసం అయితే నానబెట్టినవి తినొచ్చు.