Idli Batter: ఇడ్లీ పిండిలో ఈ ఒక్క ఆకు వేస్తే...వారం రోజులైనా పిండి పుల్లగా మారదు..!
Idli Batter: ఎండాకాలంలో ఇడ్లీ పిండి, దోశ పిండి తొందరగా తొందరగా పులుపు ఎక్కుతోందా? ఫ్రిజ్ లో పెట్టినా కూడా తాజాగా ఉండట్లేదా? ఈ ఒక్క చిట్కా ఫాలో అయితే.. వారం రోజులైనా పిండి తాజాగా ఉంటుంది..

Idli Batter
దాదాపు ఇండియన్స్ అందరూ రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ కి ఇడ్లీ, దోశ చేసుకుంటూ ఉంటారు. దీని కోసం ఇంట్లోనే ఇడ్లీ పిండి, దోశ పిండి తయారు చేసుకుంటారు.అయితే... ఎండాకాలంలో పిండి తొందరగా పులిసిపోతూ ఉంటుంది. ఇలా పులిసిపోయిన పిండితో చేసే ఇడ్లీ, దోశ రుచిగా కూడా ఉండవు. ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. మరి, ఎలాంటి చిట్కాలు వాడితే.. ఇడ్లీ, దోశ పిండి పులుపు ఎక్కకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...
అమ్మమ్మ నాటి చిట్కా..
ఇడ్లీ, దోశ పిండిలో మీరు కేవలం ఒక్క ఆకుని వేయడం వల్ల పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. అదే తమలపాకు. ముందుగా ఒక తమలపాకు తీసుకొని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుకు నెయ్యి రాసి దానిని పిండిలో వేస్తే చాలు. పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. పులిసిపోదు.
తమలపాకు ఎలా హెల్ప్ చేస్తుంది..?
తమలపాకులకు సహజంగా యాంటీ బ్యాక్టీరియల్, పీహెచ్ బ్యాలెన్స్ చేసే గుణాలు ఉన్నాయి. మీరు దానిని ఇడ్లీ పిండి, దోశ పిండిలో ఉంచినప్పుడు, అది హానికరమైన బాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. లాక్టిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా పెరగకుండా చూస్తుంది. దీని వల్ల పిండి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. పిండి రుచి మారదు.
తెల్లగా, మెత్తగా ఉండే ఇడ్లీలు
సాధారణంగా, పిండి మరీ పుల్లగా ఉంటే, ఇడ్లీలు పసుపు రంగులోకి మారతాయి లేదా రుచిగా ఉండవు. తమలపాకును ఉపయోగించడం వల్ల పిండిలోని పులుపు తగ్గడమే కాకుండా, ఇడ్లీలు దూదిలా తెల్లగా, మెత్తగా తయారవుతాయి. ఈ ఆకు పిండిలోని తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
సహజ సువాసన, ఆరోగ్యం
తమలపాకు జీర్ణక్రియకు చాలా మంచిది. పిండిలో కలిపినప్పుడు, దాని తేలికపాటి సహజ సువాసన ఇడ్లీకి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.

