Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Crispy Dosa: దోశలంటే అందరికీ ఇష్టమే. అయితే.. మనం ఎంత ప్రయత్నించినా.. హోటల్ స్టైల్ లో క్రిస్పీ గా దోశలు రావు. అలా రావాలి అంటే.. దోశ పిండిలో ఏం కలపాలో తెలుసా?

హోటల్ స్టైల్ దోశ..
సౌత్ ఇండియన్స్ రెగ్యులర్ గా ఇంట్లో దోశలు చేసుకుంటూనే ఉంటారు. కానీ.. హోటల్ స్టైల్ లో కరకరలాడుతూ మాత్రం రావు. అందుకే.. అందరికీ ఇంట్లో దోశల కంటే… బయట దోశలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే.. దోశ పిండి రుబ్బుకునేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. హోటల్ మాదిరి పర్ఫెక్ట్ దోశలు ఇంట్లోనే చేసుకోవచ్చు.
దోశ పిండి తయారు చేసుకోవడానికి ఏయే పదార్థాలు కావాలో తెలుసుకుందాం..
బియ్యం: 2 కప్పులు మినపప్పు: 1/2 కప్పు శనగపప్పు: 1 పెద్ద చెంచా (దోశకు బంగారు రంగు రావడానికి) మెంతులు: 1/2 చెంచా (రుచి, వాసన కోసం) అటుకులు: 1/2 కప్పు (దోశ మెత్తగా రావడానికి)
పిండి ఎలా తయారు చేసుకోవాలి?
శుభ్రపరచడం: బియ్యం, పప్పులను రుబ్బే ముందు కనీసం 3 సార్లు బాగా కడగాలి. దీనివల్ల పిండి తెల్లగా వస్తుంది.
నానబెట్టే సమయం: అన్ని పదార్థాలను కనీసం 5 నుంచి 6 గంటల పాటు నీటిలో పూర్తిగా మునిగేలా నానబెట్టాలి. అటుకులను మాత్రం రుబ్బడానికి 10 నిమిషాల ముందు నానబెడితే సరిపోతుంది.
పిండి రుబ్బేటప్పుడు ఎక్కువ నీళ్లు వాడొద్దు. పిండి వెన్నలా నున్నగా ఉండాలి. నీళ్లు ఎక్కువైతే దోశలు సరిగ్గా రావు.
పులియబెట్టడం (Fermentation): రుబ్బిన పిండిని కనీసం 8 గంటలు లేదా రాత్రంతా పక్కన పెట్టాలి. పిండి బాగా పొంగితేనే దోశలు రుచిగా వస్తాయి.
ఉప్పు కలపడం: పిండి బాగా పులిసిన తర్వాత, దోశలు వేసే ముందు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ముందే కలపకూడదు.
దోశలు వేసే విధానం..
పెనం మీద పిండి వేసే ముందు, పెనం మరీ వేడిగా లేకుండా చూసుకోండి (కొన్ని నీళ్లు చిలకరించి క్లాత్ తో తుడవండి). ఈ పిండితో హోటల్ స్టైల్ లో దోశలు వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి..

