Walking: భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే.. బోలెడన్ని ప్రయోజనాలు..
Walking Benefits: రాత్రి భోజనం చేసిన తరువాత వెంటనే పడుకునే బదులు కేవలం 2 నిమిషాలు నడిస్తే చాలుపలు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ మెరుగుపడి పలు సమస్యల దూరం చేస్తాయట.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భోజనం తర్వాత 2 నిమిషాలు నడక
భోజనం తర్వాత కూర్చోవడం, నిద్రపోవడం వంటివి చాలా మందికి సాధారణ విషయాలు. కానీ ఈ రెండు పనులు చేయడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న బియ్యం లేదా పిండి పదార్థాలు తిన్నట్లయితే చక్కెర స్థాయిలు రెట్టింపు అవుతుంది.
డయాబెటిస్ కు చెక్
భోజనం తర్వాత ఏమీ చేయకుండా కూర్చుంటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఇలాగే కొనసాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి భోజనం తర్వాత కేవలం 2 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
భోజనం తర్వాత నడక
3 సంవత్సరాల క్రితం స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో భోజనం తర్వాత నడవడం గురించి సమాచారం ఉంది. అందులో అనేక పరీక్షలను విశ్లేషించిన తర్వాత ఒక విషయాన్ని కనుగొన్నారు. భోజనం తర్వాత 2 నుండి 5 నిమిషాల వరకు నడవడం వల్ల కూర్చున్న వారి కంటే రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా తగ్గడానికి సహాయపడుతుందని తేలింది.
నడక ప్రయోజనాలు
నడుస్తున్నప్పుడు కాళ్ళు, శరీరంలోని ప్రధాన కండరాలు కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్ను ఉపయోగించుకునేలా చేస్తుంది. భోజనం తర్వాత వెంటనే నీరసాన్ని నివారిస్తుంది. ఒకరికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే, అది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. భోజనం తర్వాత నడవడం అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యానికి మంచిది.