Reheat Food: ఇవి వేడి చేసి తింటే విషంతో సమానం
Reheat Food: చాలామందికి ఫుడ్ వేడిగా తినడం అలవాటు. అందుకే మిగిలిన ఫుడ్ను కూడా వేడి చేసేస్తుంటారు. కానీ ప్రతి ఆహారం ఇలా వేడి చేయడానికి పనికిరాదు. కొన్ని పదార్థాలు పదే పదే హీట్ చేస్తే పోషకాలు తగ్గి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది. అవేంటో ఇక్కడ చూద్దాం.

ఇవి అస్సలు వేడి చేయకూడదు
మిగిలిపోయిన వంటలను ఫ్రిజ్లో నిల్వ చేసి తర్వాత మళ్లీ వేడి చేసుకుని తినడం సౌకర్యంగా ఫీల్ అవుతారు. కానీ ప్రతి ఆహారానికి అలా కుదరదు. కొన్ని పదార్థాలను పదేపదే వేడి చేస్తే విషంగా మారే ప్రమాదం ఉంది. జీర్ణ సమస్యలు రావొచ్చు. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అవ్వొచ్చు. కాబట్టి ఏవి తిరిగి వేడి చేయడం మంచిది కాదో తెలుసుకుని జాగ్రత్తగా ఉండడం అవసరం.
మాంసం
చికెన్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ చికెన్ను మళ్లీ వేడిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం.వేడి చేయడం వల్ల దానిలోని ప్రోటీన్లు తగ్గిపోతాయి. తీరా సరిగా జీర్ణం కాక కడుపు ఉబ్బరం, అజీర్తికి దారితీస్తుంది. చికెన్ను ఫ్రిజ్లో పెడితే బ్యాక్టీరియా పెరుగుతుంది. వండిన వెంటనే తినడం ఉత్తమం. మొదటిసారి వండేటప్పుడు 75 డిగ్రీల సెల్సియస్ వద్ద వండాలి. అప్పుడే బ్యాక్టీరియా చనిపోతుంది.
గుడ్డు
ఉడికించిన గుడ్లను లేదా వేయించిన గుడ్లను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. చికెన్ లాగే గుడ్లలో కూడా ప్రోటీన్లు ఎక్కువ. వండిన గుడ్లను మళ్లీ వేడిచేస్తే వాటి ప్రోటీన్ నిర్మాణం దెబ్బతిని, విషపూరితం కావచ్చు. ఇది తీవ్రమైన కడుపునొప్పి, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. గుడ్లను మళ్లీ వేడిచేస్తే రబ్బరులా మారి రుచిని కోల్పోతాయి. అందుకే గుడ్లను ఫ్రెష్గా వండుకోవడం మంచిది.
పుట్టగొడుగులు
పుట్టగొడుగులను వండిన వెంటనే తినడం ఉత్తమం. వీటిలో ప్రోటీన్లు, ఎంజైమ్లు ఉంటాయి. వీటిని మళ్లీ వేడి చేసినప్పుడు అవి విచ్ఛిన్నమవుతాయి. ఇది గుండె, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. సరైన ఉష్ణోగ్రతలో మళ్లీ వేడి చేయకపోతే, పుట్టగొడుగులలోని ప్రోటీన్లు విషపూరితంగా మారే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి పుట్టగొడుగులను మళ్లీ వేడి చేసి తినకూడదు.
ఆకుకూరలు
అన్నం
మిగిలిపోయిన అన్నాన్ని మరుసటి రోజు వేడి చేసి తినడం పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అన్నాన్ని గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచితే, అందులో 'బాసిల్లస్ సెరియస్' అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీన్ని మళ్లీ వేడి చేసినా, ఆ బ్యాక్టీరియా విషపదార్థాలు విడుదల చేస్తుంది. ఇది వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. అందుకే అన్నాన్ని పదేపదే వేడి చేసి తినకూడదు.
బంగాళాదుంపలు
బంగాళదుంపలను వండిన తర్వాత గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచి, ఆ తర్వాత వేడి చేయకూడదు. ఇలా చేస్తే 'బోటులిజం' అంటే ఆహారం విషమవ్వడానికి కారణమయ్యే అరుదైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. వేడి చేసినప్పటికీ, ఈ బ్యాక్టీరియా విషం పోదు. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని విషపూరితం చేసి, వ్యాధులు వ్యాపించడానికి కారణమవుతుంది.

