Kumkum: మీరు ఇంట్లో రోజూ వాడే కుంకుమ.. తయారయ్యేది ఈ గ్రామంలోనే..!
Kumkum: హిందువులు అందరి ఇంట్లో కచ్చితంగా కుంకుమ ఉంటుంది. మనం కొనే ఈ కుంకుమ ఎక్కడ తయారౌతుందో తెలుసా? దాదాపు మన దేశంలో తయారయ్యే కుంకుమ ఓ గ్రామంలో తయారౌతుంది.

కుంకుమ తయారు చేసే గ్రామం...
మన దేశంలో పండగలు, శుభాకార్యలు, పూజలు ఏది ఉన్నా.. కచ్చితంగా వాటికి కుంకుమ ఉండాల్సిందే. పూజలకు మాత్రమే కాదు.. హిందూ మహిళలు నిత్యం కుంకుమను తమ నుదుటిపై ధరిస్తారు. మన దేశంలో కుంకుమను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మనం నిత్యం వాడే కుంకుమ ఎక్కడ తయారౌతుంది? ఆ గ్రామ కథేంటో ఇప్పుడు చూద్దాం..
కుంకుమ తయారు చేసే గ్రామం...
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా తాకాలో కైమ్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం కుంకుమ తయారీకి దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశం మొత్తానికి ఇదే గ్రామం నుంచి కుంకుమ వెళ్తుంది అని చెప్పలేం కానీ.. దాదాపు.. ఎక్కువ శాతం ఇక్కడి నుంచే పంపిణీ జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామం నుంచి... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుంది. ఈ గ్రామంలో.. ఒకప్పుడు ప్రతి రోజూ 70 నుంచి 80 టన్నుల కుంకుమ తయారౌతుంది. ఈ మధ్యకాలంలో వివిధ ప్రాంతాల్లో కూడా కుంకుమ తయారీ పెరగడంతో.. కాస్త తయారీ కూడా తగ్గింది. ప్రస్తుతం అయితే ప్రతిరోజూ 40 నుంచి 50 టన్నుల వరకు తయారౌతుందని స్థానికులు చెబుతున్నారు.
కుంకుమ తయారీ బిజినెస్ కాదు ఒక ఎమోషన్..
ఈ గ్రామానికి కుంకుమ తయారీ అనేది ఒక వ్యాపారం మాత్రమే కాదు ఒక ప్యూర్ ఎమోషన్. ఈ కుంకుమ తయారీ.. ఈ మధ్య మొదలుపెట్ట లేదు. దాదాపు 300 సంవత్సరాలుగా ఈ గ్రామస్థులు కుంకుమ తయారు చేస్తున్నారు. తరతరాలుగా కుటుంబ వారసత్వంగా వారు ఈ కుంకుమ తయారు చేస్తూ వస్తున్నారు. ఈ గ్రామంలో కుంకుమ తయారీ కోసం దాదాపు 20 కుంకుమ తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి. వీటిలో వందల కొద్దీ కార్మికులు పని చేస్తుంటారు. వారిందరికీ ఈ కుంకుమ తయారు చేయడమే జీవనాధారం. కుంకుమ ప్రధాన తయారీ కాగా.. గంధం, పసుపు లాంటివి కూడా వీరు తయారు చేస్తారు.
దేవాలయాలకు కూడా ఇదే కుంకుమ..
మన దేశంలోని చాలా ప్రముఖ దేవాలయాలకు కూడా కుంకుమ ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. అయోధ్య రామ మందిర ప్రారంభ వేడుకల్లోనూ ఇక్కడి నుంచి పంపిన కుంకుమే వాడినట్లు స్థానికులు చెబుతుంటారు.
కుంకుమే కాదు.. అని తక్కువ అంచనా వేయకండి.. ఇక్కడ కేవలం కుంకుమ తోనే ప్రతి సంవత్సరం దాదాపు రూ.200 కోట్లకు పైగా వ్యాపారం చేస్తుంటారని స్థానిక మీడియా వర్గాలు చెబుతున్నాయి.
