Government Scheme : నెలానెలా రూ.20,000 ఆదాయం కావాలా..? ఈ ప్రభుత్వ పథకంలో చేరండి
రిటైర్మెంట్ తర్వాత డబ్బుల కోసం ఆలోచిస్తున్నారా..? పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) మీకు భరోసా ఇస్తోంది. దీని ద్వారా ఎంత ఆదాయం పొందవచ్చో తెలుసా..?

ఏమిటీ పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్..?
సర్వీస్ లో ఉండగా ఎక్కువ శాలరీ ఉన్నా రిటైర్మెంట్ తర్వాత ఆదాయం తగ్గిపోతుందనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. ఇలాంటివారి కోసమే కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది… అదే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). ఇందులో ఒకేసారి డబ్బు డిపాజిట్ చేస్తే దానిపై వచ్చే వడ్డీతో ప్రతీ మూడు నెలలకోసారి ఆదాయం వస్తుంది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నెలకు రూ.20,000 పైగా సంపాదించవచ్చు.
8.2% వడ్డీ
ఈ పథకంలో మన డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది. ఇది ప్రభుత్వ సపోర్ట్ తో నడిచే స్కీమ్ కాబట్టి పెట్టిన పెట్టుబడికి ఎలాంటి రిస్క్ ఉండదు. దీనికి తోడు 8.2% వడ్డీ ఇస్తుండటంతో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది. చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా ఇది ఎక్కువ వడ్డీ ఇస్తుంది. అంటే భద్రతతో పాటు మంచి రాబడి కూడా వస్తుంది.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..
ఈ స్కీమ్లో చేరడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. కనీసం రూ.1,000తో కూడా పెట్టుబడి మొదలుపెట్టొచ్చు. అంతేకాదు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. అంటే ఇది పొదుపు పథకమే కాదు, పన్ను ఆదా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఎవరు అర్హులు..?
ఎంత పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం..?
పెట్టుబడి పరిమితి చూస్తే సింగిల్ అకౌంట్లో గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు పెట్టొచ్చు. అదే జాయింట్ అకౌంట్లో అయితే రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టే వీలుంది. ఉదాహరణకు రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.2.46 లక్షల వడ్డీ వస్తుంది. అంటే ప్రతీ మూడు నెలలకు రూ.61,500, నెలకు సుమారు రూ.20,500 ఆదాయం పొందొచ్చు. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఇది నమ్మకమైన ఎంపిక. దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్లో సులభంగా అకౌంట్ తెరవొచ్చు.

