బ్యాక్ చూపిస్తూ వర్షిణి సౌందరాజన్ హోయలు.. అందం వేస్ట్ అవుతుందంటూ ఫ్యాన్స్ గగ్గోలు..
వర్షిణి సౌందరాజన్ `ఢీ` నుంచి ఇప్పుడు స్టార్ మాలో రాణిస్తుంది. అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రం టీవీలో తన అందాలను వేస్టే చేయడం ఎందుకు సినిమాల్లోకి రమ్మంటున్నారు. సినిమాల్లో చూపిస్తూ మస్తుగుందట. మరి వారి రిక్వెస్ట్ లు ఫలిస్తాయా?
సినిమాలతో కెరీర్ ప్రారంభించిన `ఢీ` భామ వర్షిణి సౌందరాజన్ సినిమాల కంటే టీవీ షోలతోనే పాపులర్ అయ్యింది. `ఢీ` షో ఈ అమ్మడికి మంచి పేరు, గుర్తింపు, క్రేజ్ని తీసుకొచ్చింది.
ఈ భామ `ఢీ`షోకి వచ్చాక హైపర్ ఆదితో ప్రేమాయణం సాగించింది. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారా? అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. అయితే హైపర్ ఆది మాత్రం బాగానే ట్రై చేశాడని టాక్. ఇదిలా ఉంటే వర్షిణి అంతకు ముందే ప్రేమలో ఫెయిల్ అయ్యింది. పెళ్లి వరకు వచ్చి అది క్యాన్సిల్ అయ్యిందని ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది.
`ఢీ` షో నుంచి అర్థాంతరంగా వైదొలిగిన వర్షిణి కొన్నాళ్లపాటు ఖాళీగానే ఉంది. కానీ ఈ అమ్మడి టాలెంట్ని గుర్తించిన స్టార్ మా ప్రతి ఆదివారం ప్రసారమయ్యే `కామెడీ స్టార్స్`లో యాంకర్గా అవకాశం ఇచ్చింది. ఈ షో కోసం అందాలు ఆరబోస్తూ, కుర్రాళ్లని ఫిదా చేస్తూ, తన చలాకీతో యాంకర్గా షోని రక్తికట్టిస్తూ అలరిస్తుంది. ఇక రెగ్యూలర్గా ఈ అమ్మడు పంచుకునే గ్లామర్ ఫోటోలకు యమ క్రేజ్, ఫాలోయింగ్ ఉంది.
తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పింక్ ఆఫ్ శారీ ఫోటోలు వైరల్గా మారాయి. నదుమందాలు, నడుము ఒంపులను చూపిస్తూ, బ్యాక్ అందాలను ఆరబోస్తూ వర్షిణి హీటు పెంచుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆమె ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
అయితే వర్షిణిని ఆమె అభిమానులు మాత్రం ఓ కోరిక కోరుతున్నారు. ఆమె అందాలపై ప్రశంసలు కురిపిస్తూనే ఓ సలహా ఇస్తున్నారు. ఆమెది హీరోయిన్ రేంజ్ అందమని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే టీవీ షోస్లో ఈ అందాన్ని వేస్ట్ చేయకండి అంటూ గగ్గోలు పెట్టుకుంటున్నారు.
టీవీ షోస్ వదిలేసి సినిమాల్లోకి రావాలని, సినిమాల్లో తన సెక్సీ అందాలను చూపిస్తే మస్తుగుంటదని, బాగా క్లిక్ అవుతావని, ఆడియెన్స్ ఫిదా అవుతారని చెబుతున్నారు. సినిమాల్లో చూపించే అందం తనదని, సినిమాలు చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే వర్షిణిసౌందరాజన్ సినిమాల్లో నుంచే టీవీల్లోకి వచ్చింది. `శంభో శివ శంభో`లో చిన్నపాత్రలో మెరిసిన వర్షిణి `చందమామ కథలు` పూర్తి స్థాయి రోల్ చేసింది. `లవర్స్`, `కాయ్ రాజా కాయ్`, `బెస్ట్ యాక్టర్స్`, `శ్రీరామరక్ష` సినిమాలు చేసింది.
`పెళ్లిగోల`, `పెళ్లిగోల2`, `పెళ్లి గోల3` వెబ్ సిరీస్లో మరింతగా గుర్తింపు తెచ్చుకుంది. పాపులరారిటీని సొంతం చేసుకుంది. దీని తర్వాత `నన్ను దోచుకుందువటే` సినిమాలో చేసింది. చివరగా `జోడి` చిత్రంలో మెరిసింది.
ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు ఫ్యాన్స్ మళ్లీ సినిమాలకు రావాలని కోరుతుండటం విశేషం. మరి ఈ అమ్మకి సినిమాల్లో అవకాశాలు వస్తాయా? అన్నది చూడాలి.