- Home
- Entertainment
- ఎన్టీఆర్ , కృష్ణ మధ్య టైటిల్ వార్, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? గెలిచింది ఎవరు..?
ఎన్టీఆర్ , కృష్ణ మధ్య టైటిల్ వార్, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? గెలిచింది ఎవరు..?
ఇప్పుడే కాదు అప్పట్టో కూడా సినిమా వివాదాలు దారుణంగా ఉండేవి. ఫ్యాన్స్ వార్ తో పాటు టైటిల్ క్లాష్ లు, రిలీజ్ కొట్లాటలు జరిగేవి. ఓ సారి పెద్దాయన ఎన్టీఆర్,కృష్ణల మధ్య టైటిల్ కోసం గొడవ జరిగిందట. అది కూడా వాళ్ల సినిమాల కోసం కాదు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టాలీవుడ్ మొదటి తరం హీరోలలో ఎన్టీఆర్ తరువాత మూడో ప్లేస్ లో ఉన్నారు కృష్ణ. ఎన్టీఆర్ - కృష్ణ మధ్య ఎంత స్నేహం ఉందో.. అంత కాంట్రవర్సీ కూడా నడుస్తూ ఉండేది. వరుస వివాదాలతో వీరు శత్రువులు అన్న ముద్ర పడిపోయింది అప్పట్లో. పంతాలు పట్టింపులతో పోటా పోటీగా ఉండేవారు ఇద్దరు హీరోలు. అంతే కాదు ఎవరు ఏ విషయంలో తగ్గేవారు కాదు. ఇలానే ఓసందర్భంలో వీరిమధ్య ఓ సినిమా టైటిల్ కోసం పెద్ద వారే జరిగిందట. ఇంతకీ ఈ గొడవలో ఎవరు నెగ్గారంటే..?
Also Read: చిరంజీవి కంటే ముందు టాలీవుడ్ మెగాస్టార్ ఎవరో తెలుసా? చిరు మెగా హీరో ఎలా అయ్యారు?
సీనియర్ ఎన్టీఆర్ – సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఎన్నో విషయాలలో పోటీ ఉండేది. ఈ విషయం అందరికి తెలుసు. సినిమాల విషయంలోనే కాదు, పొలిటికల్ గా కూడా వీరిమధ్య ఎప్పుడు ఏదొ ఒక వివాదం నడుస్తుండేదట. ఇక అన్నింటితో పాటు వీరిమధ్య టైటిల్ వివాదం కూడా నడిచింది. అయితే విచిత్రం ఏంటంటే.. ఈ టైటిల్ వివాదం వీరి సినిమాలది కాదు. వీరిద్దరి వారసుల సినిమాల కోసం టైటిల్ ఇష్యు జరిగింది.
Also Read: 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను, గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయనతార, ఇంతకీ ఎవరా హీరో?
Ramesh Babu
టాలీవుడ్ లో ఒకే టైటిల్ ఈ స్టార్ హీరోల తనయులు రెండు సినిమాలు చేశారు. ఎవరు తమ టైటిల్స్ ను మార్చుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో ఇష్యు పెద్దది అయ్యింది. ఇక విషయం ఏంటంటే..? సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబును హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు. రమేష్ బాబు అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక ఆయన్ను హీరోగా పరిచయం చేసే క్రమంలో . సామ్రాట్ సినిమాను స్టార్ట్ చేశారు కృష్ణ.
Also Read: శోభన్ బాబు అత్తా అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?
బాలీవుడ్ లో హిట్ అయిన బేతాబ్ సినిమాను తెలుగులో సామ్రాట్ గా రీమేక్ చేయాలని సినిమాను మొదలుపెట్టారు. హిందీలో సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈసినిమాను తెలుగులో విక్టరీ మధుసూదన్ రావు డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ నుంచి సోనమ్ అనే హీరోయిన్ ను ఈసినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. సినిమాను చేశారు.
Also Read:బిగ్ బాస్ తెలుగు నుంచి నాగార్జున ఔట్, కొత్త హోస్ట్ గా పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోలు?
ఇక ఈ టైటిల్ వివాదంఅయ్యింది. ఇదే టైటిల్ తో బాలకృష్ణ హీరోగా మరో సినిమా తెరకెక్కింది. నిర్మాత కెసి శేఖర్ బాబు బాలకృష్ణతో సామ్రాట్ అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తానని చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సారధ్యంలో ఈమూవీ తెరకెక్కింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
Also Read:53 ఏళ్ళ బ్యాచిలర్ హీరోయన్,5 ఏళ్లుగా టాలీవుడ్ పై అలిగిన ముదురు భామ ఎవరో తెలుసా?
ఈ సినిమా టైటిల్ ను కృష్ణ ముందే రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్ ను మార్చడానికి నిర్మాత శేఖర్ బాబు ఒప్పుకోలేదు. అటు బాలయ్య కోసం పెద్దాయన ఎన్టీఆర్ రంగంలోకిదిగగా.. ఇటు రమేష్ బాబు తరపున కృష్ణ ముందు నుంచే రంగంలో ఉన్నాడు. ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ సామ్రాట్ టైటిల్ బాలయ్య సినిమాకే పెట్టాలని పంతం పట్టారు. సామ్రాట్ టైటిల్ తో సినిమా స్టార్ట్ చేసి.. రిలీజ్ కు కూడా రెడీ అయ్యారు. రెండు సినిమాలు సామ్రాట్ అనే టైటిల్ తో ప్రమోషన్స్ కూడా చేశారు.
కాని ఈ వివాదం ఎక్కడివరకూ వెళ్తుందో అని భయపడ్డ ఇండస్ట్రీ పెద్దలు కొంత మంది.. రెండు వైపుల సర్దిచెప్పి.. అంతకు ముందే కృష్ణ రిజిస్టేషన్ చేసుకున్నారని.. నచ్చచెప్పడంతో.. బాలయ్య సినిమాను సహస్ర సామ్రాట్ గా మార్పించారు. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ .. సామ్రాట్ టైటిల్ తో వచ్చిన ఈరెండు సినిమాలు భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాయి. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.