పిల్లలకు ప్లానెప్పుడు? సమంత టూ ప్రియాంక, ఉపాసన టూ దీపికా.. ఈ భామలకు తరచూ ఎదురవుతున్న ప్రశ ఇదే.. సమాధానమేంటి?
టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా పెళ్లైన హీరోయిన్లకి ఎదురయ్యే ప్రశ్న పిల్లలెప్పుడు? ఇప్పుడు సమంత, ఉపాసన, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, సోనమ్ కపూర్, శ్రియాలకు తరచూ ఇదే ప్రశ్న ఎదురవుతుంది.
అమ్మాయి జీవితంలో ప్రతిదీ ప్రశ్నే. సినిమా హీరోయిన్లకైతే రకరకాల ప్రశ్నలు ఎదురవుతుంటాయి. నటిగా రాణిస్తున్నసమయంలో డేటింగ్ ప్రశ్నలు. ఆ తర్వాత కెరీర్ పరంగా ఓ దశకి చేరుకున్నాక పెళ్లెప్పుడనే ప్రశ్నలు. పెళ్లైన తర్వాత పిల్లలెప్పుడు? అవును సాధారణ మహిళలకు ఎదురయ్యే ప్రశ్నలే హీరోయిన్లకు కూడా ఎదురవుతుంటాయి. ఓ వైపు మీడియాలో, మరోవైపు సోషల్ మీడియాలో ఇంకోవైపు ఫ్యామిలీస్లో తరచూ ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతుంటాయి. అలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పెళ్లై చాలా రోజులవుతుండటంతో కొందరు కథానాయికలకు పిల్లలెప్పుడనే ప్రశ్న తరచూ ఎదురవుతూనే ఉంది. ఆ సంగతులేంటో ఓ లుక్కేద్దాం.
సమంత స్టార్ హీరోయిన్గా పీక్లో ఉన్నప్పుడే ప్రియుడు నాగచైతన్యని పెళ్లి చేసుకుంది. వీరి మ్యారేజ్ జరిగి నాలుగేళ్లు అవుతుంది. దీంతో ఇటీవల తరచూ సమంతకి పిల్లలెప్పుడనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చివరికి నాగార్జునని కూడా గంగవ్వ ప్రశ్నించింది.
దీనికి సమంత చెప్పే సమాధానం. దానికి టైమ్ రావాలి అని, పిల్లలు తమ జీవితంలో ప్రత్యేకమైన స్థానం అని, ఆ మూవ్మెంట్ వచ్చాక తన సర్వస్వం పిల్లలే అవుతారని చెప్పింది సమంత. దీంతో ఇంకా కొన్ని రోజుల పాటు పిల్లల ప్లానింగ్లో లేనట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల సమంత ఓ చిన్న ఇంటి ముందు మామిడి కాయ చూపిస్తూ ఫోటో దిగడంతో ఆమె ప్రెగ్నెన్సీ అనే వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది.
మరోవైపు రామ్చరణ్, ఉపాసనకి కూడా పిల్లలెప్పుడనే ప్రశ్నలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. చిరంజీవిని కూడా మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు. చెర్రీ, ఉపాసనకి మ్యారేజ్ అయి తొమ్మిదేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు పిల్లల ఊసే లేదు.
చూడబోతే ఇప్పట్లో ఉపాసన పిల్లల్ని కనే ఆలోచనలో లేనట్టు తెలుస్తుంది. వారి వైపు నుంచి ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. డైరెక్ట్గా ఎప్పుడూ స్పందించలేదు. అదే సమయంలో ఏదైనా సమస్యనా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు ఉపాసన ఓ వైపు అపోలో ఆసుపత్రిలు, సామాజిక కార్యక్రమాలతో బిజీగా గడుపుతుంది.
ఇక బాలీవుడ్లోనూ మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ చిల్డ్రన్స్ అని చెప్పేందుకు ముగ్గురు హీరోయిన్లున్నారు. వారిలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక విషయానికి వస్తే హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్తో మ్యారేజ్ జరిగి మూడేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ప్రకటించలేదు.
ప్రియాంక జోడి కూడా ఇప్పట్లో పిల్లల ప్లానింగ్లో లేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రియాంక హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటుంది. మరోవైపు అంతర్జాతీయ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతుంది. మరి ప్రియాంక ఎప్పుడు గుడ్న్యూస్ చెబుతుందని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దీనికి ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.
అలాగే దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ జోడీ సైతం చిల్డ్రన్స్ కి సంబంధించిన ప్లాన్ లో లేనట్టు తెలుస్తుంది. వీరి మ్యారేజ్ జరిగి కూడా మూడేళ్లు అవుతుంది. ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. కెరీర్ పరంగా పీక్ స్టేజ్లో ఉన్నారు.
దీపికా పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో మరో రెండేళ్ల వరకు బిజీగా ఉండబోతుంది. పిల్లలెప్పుడు అనే ప్రశ్నలను స్కిప్ చేస్తూ వస్తుంది దీపికా. మరి దీనికి ఎప్పుడు సమాధానం చెబుతుంది. చిల్డ్రన్స్ ప్లాన్ ఎప్పుడుంటుంది? అనేది ప్రశ్నగానే ఉంది.
అనిల్ కపూర్ డాటర్ సోనమ్ కపూర్ కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ సినిమాలతో రాణిస్తుంది. ఈ క్రమంలో ఆమె 2018లో బిజినెస్మ్యాన్ ఆనంద్ ఆహుజాని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు. ఒకటి అర చిత్రాల్లో మెరిసింది.
కానీ ఇంకా చిల్డ్రన్స్ ప్లాన్ని రివీల్ చేయలేదు సోనమ్ కపూర్. ఈ అమ్మడికి కూడా తరచూ మీడియాలో పిల్లలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నా స్కిప్ చేస్తూ వెళ్తున్నారు. అయితే త్వరలోనే వీరి నుంచి గుడ్న్యూస్ అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
టాలీవుడ్తోపాటు హిందీ, అలాగే సౌత్ని ఓ ఊపు ఊపిన శ్రియా సైతం మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ చిల్డ్రన్ లిస్ట్ లో ఉంది. ఈ అమ్మడు మూడేళ్ల క్రితం రష్యాకి చెందిన బాయ్ఫ్రెండ్ ఆండ్రూ కొస్చీవ్ని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంది. అక్కడే సెటిల్ అయ్యింది. అడపాదడపా సినిమాలు చేస్తుంది. అయితే మూడేళ్లవుతున్నా పిల్లలపై ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ మీడియాకి కూడా దొరక్కుండా తిరుగుతుంది శ్రియా. కెరీర్ కూడా ఆశాజనకంగా లేదు. మరి చిల్డ్రన్స్ కి ఎప్పుడు ప్లాన్ చేస్తుందో చూడాలి.
హీరోయిన్లు పిల్లల్ని కనడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారి పిల్లల్ని కన్నాక వారి లైఫ్ మారిపోతుంది. పిల్లలతో బిజీ అవుతారు. మరోవైపు ఫిట్నెస్ కూడా కొల్పోతారు. పిల్లలకు జన్మనిచ్చాక హీరోయిన్గా చేయడం కూడా చాలా కష్టం. హీరోయిన్ అంటే అందం. ఆ అందం తగ్గితే ఆడియెన్స్ పట్టించుకోరు. అందుకే హీరోయిన్లు పిల్లల విషయంలో వెనకడుగు వేస్తున్నారు. కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్ చేస్తే కెరీర్కే దెబ్బ. దానికోసమే ఇంకొన్నాళ్లపాటు వారు వెయిట్ చేస్తున్నారని, ఇక నటనకు ఫుల్ స్టాప్ పెట్టాలని గానీ, సినిమాలు తగ్గించాలనే ఆలోచనకు వచ్చినప్పుడుగానీ పిల్లలపై ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయని టాక్.