రియాకి ఇలా జరగడంతో ఆత్మహత్య చేసుకోవాలకున్నా.. రియా తల్లి ఆవేదన
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి మూడు రోజుల క్రితం బెయిల్ పై విడుదలయ్యింది. అయితే రియా తల్లి మాత్రం చాలా మనోవేదనకు గురయ్యింది. తాజాగా ఆమె ఈ విషయాలను పంచుకుంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిపై అనేక ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఆమెని అరెస్ట్ చేసింది. గత నెల 8న అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.
బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటిషిన్ పలుమార్లు తిరస్కరింపబడింది. దీంతో రియా తరఫున లాయర్ బాంబే హైకోర్ట్ ని ఆశ్రయించగా, ఎట్టకేలకు మూడు రోజుల క్రితం కోర్ట్ లక్ష రూపాయల వ్యక్తగత పూచికత్తుపై రియాకి బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉంటే ఓ వైపు రియా చక్రవర్తి, మరోవైపు సోదరుడు సోయిక్ సైతం అరెస్ట్ అయి జైల్లో ఉండటంతో రియా మదర్ సంధ్య చక్రవర్తి తీవ్ర మనో వేదనకు గురయ్యిందట.
తనకు రాత్రి సమయాల్లో నిద్ర పట్టేది కాదట. వరుసగా ఎన్నో రోజులు నిద్ర లేని రాత్రులు గడిపానని తాజాగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.
ఒకానొక దశలో తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుందట. కానీ తమ బిడ్డల భవిష్యత్ని గురించి ఆలోచించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలిపింది.
గతేడాది ఇదే సమయంలో తమ కూతురు రియా, సుశాంత్ యూరప్ టూర్కి వెళ్ళారని, కానీ సరిగ్గా ఏడాది తర్వాత జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపింది. ఏడాది క్రితం లగ్జరీ హోటల్లో ఉంటే, ఇప్పుడు జైల్లో బతకాల్సి వచ్చింది.
నెల రోజులు జైల్లో గడిపిన రియా ఇంటికి వచ్చినప్పుడు కన్నీంటి పర్యంతమయ్యిందట. కానీ కుమారుడు సోయిక్ ఇంకా ఇంటికి రాకపోవడంతో తన బాధ తీరడం లేదని పేర్కొంది.
సోయిక్ బాగా తింటాడు. కానీ జైల్లో ఎలా తింటున్నాడో, ఎలా పడుకుంటున్నాడో ఊహించుకుంటేనే ఏడుపొస్తుంది. నా పిల్లలు ఇంట్లో లేకపోయేసరికి నిద్ర పట్టలేదని పేర్కొంది.