`ఆర్ ఆర్ ఆర్` కోసం 1920 రీక్రియేషన్.. అదొక అద్భుతమైన విజువల్ వండర్!
`ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ పునప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినిమా కోసం 1920 నాటి కాలాన్ని రీక్రియేట్ చేస్తున్నారని అర్థమవుతుంది. మరి ఆ విజువల్ వండర్ ఏంటో ఓ లుక్కేద్దాం.
గతేడాది ఎన్టీఆర్,రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.
`ఆర్ఆర్ఆర్`..రౌద్రం రణం రుధిరం.. తెలుగులో అత్యంత భారీ బడ్జెట్తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియాభట్, ఒలివియా మోర్రీస్ హీరోయిన్లుగా, అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. సినిమా కథ 1920 కాలంలో ఉత్తర భారతంలో జరుగుతుందని రాజమౌళి ప్రకటించారు.
ఈ సినిమా పోస్టర్ని పంచుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈ సినిమా వివరాలు వెల్లడించారు. అంతేకాదు ఈ ఏడాది జులై 30న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్కి, చరణ్కి గాయాల కారణంగా వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేశారు. తాజాగా మరోసారి వాయిదా వేస్తూ అక్టోబర్ 22న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
`ఆర్ ఆర్ ఆర్` అన్ని భాషలకు ఒకే టైటిల్ అని, దానికి వివిధ భాషల్లో సూట్ అయ్యే టైటిల్ చెప్పాలని అభిమానులకు సూచించారు. దీనికి విశేష స్పందన లభించింది. ఫైనల్గా `రౌద్రం రణం రుధిరం` అనే టైటిల్ని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ అబ్బురపరిచింది.
మధ్యలో లాక్డౌన్ టైమ్ల్ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర టీజర్ని విడుదల చేశారు. భీమ్ ఫర్ రాజు పేరుతో ఈ టీజర్ని విడుదల చేయగా, ఇది ట్రెండ్ అయ్యింది. ఇందులో చరణ్ అల్లూరి పాత్రలో పోలీస్ గా కనిపిస్తారని అర్థమవుతుంది.
కరోనా విజృంభన, లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డ `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ మంగళవారం తిరిగి ప్రారంభించారు. ఈ మేరకు ఓ వీడియోని పంచుకున్నారు.
ఈ విషయాన్ని పంచుకున్న వీడియో తెలిపారు. ఆడియెన్స్ కి డబుల్ కిక్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు.
తాజాగా విడుదల చేసిన వీడియోలో పెద్ద కోట డోర్ ఓపెన్ చేసే ప్రక్రియ నుంచి ప్రారంభమైంది.
ఈ కోట డోర్ ఓపెన్ చేయడం చూస్తుంటే ఇది ఆర్ఎఫ్సీలో షూటింగ్ జరుగుతుందని అర్థమవుతుంది.
సినిమా కోసం భారీ కోటలనే ఏర్పాటు చేశారు. ఇందులో ఆనాటి బ్రిటీష్ వాళ్ళు ఉండే ఢిల్లీ ప్రావిన్స్ ని ఢిల్లీ ఎక్స్ ఛేంజ్ పేరుతో ఉన్న భవంతిని క్లీన్ చేస్తున్నారు.
లొకేషన్ పరిసర ప్రాంతాలను ముందుగా క్లీన్ చేశారు.
ఈ సినిమాకి వాడే కాస్ట్యూమ్స్ సైతం ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇందులో అల్లూరి సీతారామరాజుకి, కొమురంభీమ్కి సపరేట్ కాస్ట్యూమ్స్ పెట్టేలను ఓపెన్ చేశారు.
అంతేకాదు బ్రిటీష్ వాళ్లు వాడే ఆనాటి లగ్జరీ కారుని దుమ్ము దులిపారు. పిఎంఐ612 నెంబర్తో ఉన్న కారు లుక్ అదిరిపోయింది. సినిమా ఒక వండర్ఫుల్గా ఉండబోతుందని, 1920 నాటి కాలాన్ని రీక్రియేట్ చేయబోతున్నారని అర్థమవుతుంది.
1920 కాలంలో వాడు తుపాకులను ప్రత్యేకంగా రెడీ చేయించారు. కొన్నింటిని వివిధ స్టేషన్ల నుంచి సేకరించినట్టు తెలుస్తుంది.
బ్రిటీషర్లు వాడే సోఫాల దుమ్మూ దులిపారు.
మరోవైపు కరోనా నేపథ్యంలో నటీనటులు, టెక్నీషియన్లు, కార్మికులు అందరిని ముందుగానే చెక్ చేశారు. లొకేషన్ మొత్తం శానిటైజ్ చేశారు.
లొకేషన్ కోసం ఏకంగా భారీ చెట్లనే నాటిసహజత్వం తీసుకొచ్చారు.
ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తున్న రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ ని రెడీ చేస్తున్నారు.
బ్యాక్ ఇన్ షూట్లో భాగంగా కెమెరాని సిద్ధం చేశారు.
పెద్ద లైట్స్ వేశారు. లొకేషన్కి కొత్త లుక్ని తీసుకొచ్చారు.
సెట్లోకి వచ్చిన నిర్మాత డి వివి దానయ్య రమా రాజమౌళితో డిస్కస్ చేశారు. ఆయన దగ్గరుండి అన్ని చూసుకున్నారు.
రాజమౌళి.. రెడీ హీరోస్ అనగానే గుర్రంపై రామ్చరణ్.. అల్లూరి లుక్లో రెడీగా ఉన్నారు. ఇందులో చెర్రీ టక్ వేసుకుని స్టయిల్గా ఉన్నారు.
కొమురంభీమ్ లుక్లోకి మారిన ఎన్టీఆర్ వాయిలెట్ కలర్ లాల్చీ వేసుకుని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై రేస్ పెంచుతూ రెడీగా ఉన్నారు.
రాజమౌళి యాక్షన్ అన్నారు.
గుర్రంపై చరణ్, బుల్లెట్పై ఎన్టీఆర్ సెట్లోకి దూసుకొచ్చారు.
ఇద్దరు ఒకేసారి రావడం ఆకట్టుకుంది. అయితే వీరి లుక్లను మాత్రం చూపించకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి.
ఎన్టీఆర్, రామ్చరణ్ వస్తుండగా, కెమెరాలో వారిని బంధించారు. మొత్తంగా సినిమా తిరిగి ప్రారంభం కావడంతో బజ్ మళ్ళీ ఊపందుకుంది. సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొమురం భీమ్ పాత్ర టీజర్ కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే అది విడుదల చేయనున్నట్టు చెర్రీ ప్రకటించారు.