ఒక వైపు విడాకుల రూమర్స్.. దీపావళి రోజున భర్తని ఉద్దేశిస్తూ ప్రియమణి పోస్ట్, వైరల్
నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి.
నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు.
Priyamani
కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో Priyamani ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది.
సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే ప్రియమణి వ్యక్తి గత జీవితం గురించి ఇటీవల కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రియమణి తన భర్త ముస్తఫా రాజ్ తో దూరంగా ఉంటోందని.. ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు అంటూ ప్రచారం జరిగింది.
ఈ రూమర్స్ పై ప్రియమణి కూడా అంతగా స్పందించలేదు. రీసెంట్ గా ప్రియమణి తన భర్తకి సంబంధించిన పోస్ట్ లు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడంతో ఫ్యాన్స్ లో ఈ చర్చ ఎక్కువైంది. అయితే ఈ రూమర్స్ కి తెరదించుతూ ప్రియమణి తన భర్త గురించి పోస్ట్ చేసింది. దీపావళి సందర్భంగా ప్రియమణి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
తన కుటుంబ సభ్యులతో కలసి దీపావళి సెలెబ్రేట్ చేసుకుంటూ ఆ పిక్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నా నుంచి నా వాళ్ళ నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు అని పోస్ట్ చేసింది. తన భర్తని ఉద్దేశిస్తూ 'మిస్ యు ముస్తఫా రాజ్' అని కూడా కామెంట్ పెట్టింది.
దీనికి స్పందించిన ముస్తఫా 'మిస్ యు టూ' అని రిప్లై ఇవ్వడమే కాదు లవ్ ఎమోజి కూడా పోస్ట్ చేశాడు. దీనితో వీరిద్దరి గురించి వస్తున్న రూమర్స్ దీపావళి రోజున పటాపంచలు అయినట్లు ఐంది. ముస్తఫా తన బిజినెస్ వర్క్ వల్ల యుఎస్ లో బిజీగా ఉన్నాడని.. అందువల్లే వీరిద్దరూ కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతే కానీ ప్రియమణి, ముస్తఫా మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంటున్నారు.