ప్రదీప్ భార్యగా హీరోయిన్ పూర్ణ...రొమాన్స్ మరీ ఈ రేంజ్ లోనా..!
కొత్తగా మరో జంట ఢీ షోలో ఎంటర్ అయ్యింది. సుధీర్, ఆది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తుండగా, ప్రదీప్ కూడా దీనిపై ద్రుష్టి సారించారు. ఆయన ఏకంగా జడ్జి పూర్ణను లైన్ లో పెట్టాడు. షోలో వీరిద్దరి వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.
ఢీ షో చిన్నగా తన రూపు రేఖలుమార్చుకుంటుంది. డాన్స్ షోగా మొదలైన ఢీ కామెడీ మరియు రొమాన్స్ ప్రధానంగా సాగుతుంది. గతంలో యాంకర్స్ లవర్స్ గా మారగా, తాజాగా జడ్జిలు కూడా ఈ లిస్ట్ లో చేరిపోయారు. దీనితో షో మరింత ఆసక్తికరంగా మారింది.
ఢీ షోలో యాంకర్ సుధీర్ మరియు రష్మీ రొమాన్స్ ప్రత్యేక ఆకర్షణ. వీద్దరి మధ్య రొమాన్స్ షోకి గొప్ప అడ్వాంటేజ్. ఈ ఫార్ములా సక్సెస్ కావడంతో నిర్మాతలు వీరిపై ఫోకస్ పెట్టారు. షోకి మంచి టీఆర్పీ దక్కడంలో వీరు కీలకపాత్ర పోషించారు.
ఈ జంట జనాలకు బోర్ కొట్టిందనుకున్నారేమో కానీ కొత్తగా ఆది-వర్షిణిలను దించారు. వేదికపై వీరిద్దరిని కొత్త జంటగా పరిచయం చేశారు. వీరు కూడా ప్రేక్షకులకు మంచి ఫన్ పంచుతున్నారు.
కొత్తగా మరో జంట ఢీ షోలో ఎంటర్ అయ్యింది. సుధీర్, ఆది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తుండగా, ప్రదీప్ కూడా దీనిపై ద్రుష్టి సారించారు. ఆయన ఏకంగా జడ్జి పూర్ణను లైన్ లో పెట్టాడు.
షోలో వీరిద్దరి వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.గతంలో ప్రదీప్ పై తనకు మనసైనట్లు పూర్ణ చెప్పడం జరిగింది. ఇక రాబోయే ఎపిసోడ్ కోసం వీరు కొంచెం అడ్వాన్స్ అయినట్లు ప్రోమో ద్వారా తెలుస్తుంది.
తాజా ఎపిసోడ్ కోసం ప్రదీప్, పూర్ణ భార్యాభర్తలుగా మారారు. ఈ స్కిట్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పీక్స్ లో ఉంది. పూర్ణ చాలా సహజంగా ప్రదీప్ వైఫ్ పాత్రలో ఒదిగిపోయింది.
ప్రోమో చూస్తుంటే నిజంగా వీరి మధ్య ఏదైనా ఉందా అనే డౌట్ కొడుతుంది. కొత్త జంట పూర్ణ ప్రదీప్ షోకి మరింత ఆదరణ తీసుకురావడం ఖాయం అనిపిస్తుంది.