షర్ట్ కూడా చిరిగి పోయింది అనసూయకు అవమానం... సోషల్ మీడియా వేదికగా ఆవేదన!
ఒక ఎయిర్ లైన్స్ సంస్థ అవమానించినట్లు, ఇబ్బందులకు గురి చేసినట్లు అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. చివరకు తన షర్ట్ కూడా చిరిగిపోయిందంటూ సుదీర్ఘ సందేశం విడుదల చేసింది.
Anasuya Bharadwaj
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఫైర్ బ్రాండ్స్ లో ఆమె ఒకరు. విషయం ఏదైనా కుండబద్దలు కొట్టడం ఆమె నైజం. ఇక తనకు ఇబ్బంది కలిగితే ఊరుకుంటుందా?. ఎయిర్ పోర్ట్ వేదికగా జరిగిన ఒక ఇబ్బందికర సంఘటనపై తనదైన శైలిలో స్పందించారు.
బెంగుళూరు నుండి హైదరాబాద్ కి అనసూయ కుటుంబ సభ్యుల పాటు ప్రయాణమయ్యారట. దీని కోసం ఆమె ఒక ఎయిర్ లైన్స్ సంస్థలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. టికెట్ లో ఉన్న సమయం కంటే ముందే ఎయిర్ పోర్ట్ కి రావాలని ఎయిర్ లైన్ సంస్థ వారు సందేశం పంపారట. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాక మాస్క్ లు లేవని లోపలి పంపలేదట.
మాస్క్ లు ధరించి ఫ్లైట్ లోపలికి వెళ్లగా... సీట్లు ఒక చోట కాకుండా అక్కడక్కడ కేటాయించారట. వరుసగా సీట్లు బుక్ చేస్తే వేరు వేరుగా ఎలా కూర్చోబెడతారని అనసూయ అడిగితే సమాధానం లేదట. పైగా అనసూయ కూర్చున్న సీటు సరిగా లేదట. చిరిగిపోయి ఉండటం వలన పదునైన వస్తువును తాకి ఆమె చొక్కా చిరిగి పోయిందట.
ఎయిర్ పోర్ట్ తో పాటు ఫ్లైట్ లో ఎదురైన ఇబ్బందికర పరిస్థితులు వివరిస్తూ అనసూయ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు. ఆమె ప్రయాణం చేసిన ఎయిర్ లైన్స్ సంస్థను చెత్త సంస్థగా అభివర్ణించారు. ప్రస్తుతం అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతుంది. అనసూయకు జరిగిన కోసం చూస్తుంటే ఆమె మరలా సదరు సంస్థలో టికెట్స్ బుక్ చేయరనిపిస్తుంది.
మరి అనసూయ సందేశానికి సదరు ఎయిర్ లైన్స్ సంస్థ సమాధానం ఇస్తారో లేదో చూడాలి. ఇటీవల అమెరికా వెళ్లిన అనసూయ తానా సభల్లో పాల్గొన్నారు. అమెరికాలో సెటిలైన అమెరికన్స్ జరుపుకున్న వేడుకల్లో ఆడిపాడారు.
Anasuya Bharadwaj
నటిగా బిజీ అయిన అనసూయ యాంకరింగ్ పై దృష్టి తగ్గించారు. జబర్దస్త్ కూడా వదిలేసిన ఆమె చేతిలో ఒకటో రెండో షోలు ఉన్నాయి. ప్రస్తుతం అనసూయ పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన గాడ్ ఫాదర్ విడుదలై విజయం సాధించింది.