ట్రీట్మెంట్ కి ముందు ఓసారి పిల్లల్ని కలుసుకుందాం అని దుబాయ్ వెళుతున్న సంజయ్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సడన్ గా దుబాయ్ ప్రయాణం అయ్యారు. ఆయన భార్య మానయత తో కలిసి దుబాయ్ వెళుతున్నారు. సంజయ్ ఆకస్మికట్ ప్రయాణానికి కారణం పిల్లల్ని కలవడం అని తెలుస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్ దత్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లనున్నారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భార్య మానయతతో కలిసి దుబాయ్ వెళుతున్నారు. దుబాయ్ ఫ్లైట్ లో సెల్ఫీ తీసుకున్న ఈ జంట దానిని షేర్ చేయడం జరిగింది. వీరి ఆకస్మిక దుబాయ్ ప్రయాణం వెనుక కారణం పిల్లలను కలవడానికని తెలుస్తుంది. సంజయ్ పిల్లలు షహరన్ మరియు ఇక్రా లాక్ డౌన్ ముందు నుండే దుబాయిలో ఉంటున్నారు. సంజయ్ భార్య మానయత కూడా దుబాయిలో పిల్లలతో ఉంటున్నారు. సంజయ్ దత్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఆమె ఇండియాకు వచ్చాడు.
కొన్ని రోజులు వర్క్ కి బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పిన సంజయ్ దత్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారు. సంజయ్ దత్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని, లీలావతి ఆసుపత్రి వర్గాలు అనధికార ప్రకటన చేయడం జరిగింది. సంజయ్ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా, అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేయలేదు. అలాగే తనకు క్యాన్సర్ ఉందన్న విషయాన్ని ఆయన ఖండించారు.
కొద్దిరోజుల క్రితం అమెరికా నుండి ఇండియాకు తిరిగొచ్చిన సంజయ్ దత్ కెజిఎఫ్ 2తో పాటు మరికొన్ని చిత్రాల షూటింగ్స్ లో పాల్గొన్నారు. దీనితో ఆయన తిరిగి అమెరికా ట్రీట్మెంట్ కోసం వెళ్లనున్నారట. ఈ నేపథ్యంలో పిల్లలను కలవడానికి ఈ జంట దుబాయ్ వెళుతున్నారు. ఓ ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ లో ఈ జంట దుబాయ్ చేరుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్ట్ కెజిఎఫ్ 2 మూవీలో ప్రధాన విలన్ అధీరా పాత్ర సంజయ్ చేస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సడన్ గా దుబాయ్ ప్రయాణం అయ్యారు. ఆయన భార్య మానయత తో కలిసి దుబాయ్ వెళుతున్నారు. సంజయ్ ఆకస్మికట్ ప్రయాణానికి కారణం పిల్లల్ని కలవడం అని తెలుస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్ దత్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లనున్నారు.