అన్నీ పోగొట్టుకుని ఫ్యామిలీ అంతా రోడ్డున పడ్డాం.. షాకింగ్ విషయాలు పంచుకున్న అమీర్ ఖాన్
తాము అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డామంటున్నాడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. సినిమాల్లో సంపాదించింది ఏం లేదని, చాలా దివాళా తీశామని షాకింగ్ విషయాలను బయపెట్టాడు అమీర్ ఖాన్.
బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్ అంటే అమీర్ ఖాన్ గుర్తొస్తారు. ఖాన్ త్రయంలో అగ్ర స్థానంలో నిలిచిన అమీర్ ఖాన్ విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. నేషనల్ స్టార్గా రాణిస్తున్నారు. `లగాన్`, `3 ఈడియట్స్`, `దూమ్3`, `పీకే`, `దంగల్` చిత్రాలతో అంతర్జాతీయంగానూ సత్తాచాటారు.
సామాజిక, సందేశాత్మక, కమర్షియల్ అంశాలను మేళవించిన చిత్రాలు చేస్తూ తానేంటో నిరూపించుకుంటున్నారు. తాజాగా అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒకానొక దశలో తమ ఫ్యామిలీ అంతా పోగొట్టుకుని రోడ్డున పడిందని చెప్పారు.
అమీర్ ఖాన్ తండ్రి తహీర్ హుస్సేన్ నిర్మాత, నటుడు, దర్శకుడిగా రాణించారు. ఆయన ఎక్కువగా సినిమాలు నిర్మించారు. కానీ చాలా పోగొట్టుకున్నాడట. ఈ విషయాన్ని అమీర్ తెలిపారు.
సినిమా రంగంలోని నిర్మాతగా తన తండ్రి సాధించింది ఏం లేదని, ఓ దశలో ఫ్యామిలీ మొత్తం దివాళా తీసిందని చెప్పారు. వాళ్ల నాన్న నిర్మాతగా మంచి సినిమాలను నిర్మించారట. కానీ వాటిపై వ్యాపారం చేయడం తెలియదట.
ఆయన నిర్మించిన సినిమాల్లో ఓ చిత్రానికి ఎనిమిదేళ్లు పట్టిందట. అలాగే మరో సినిమాకి మూడేళ్లు పట్టిందట. ఈ విషయం ఎవరికీ తెలియదని వెల్లడించాడు అమీర్. ఏళ్ల తరబడి సినిమాలు చేయడం, వడ్డీలు పెరగడం, సినిమాని సరైన విధంగా మార్కెట్ చేయలేకపోవడం వంటి కారణంగా అప్పుల పాలయ్యారని, రోడ్డున పడే పరిస్థితి ఎదురయ్యాందని చెప్పాడు.
నిర్మాణంతో ఫ్యామిలీ అంతా పోగొట్టుకుందని చెప్పాడు. తండ్రి అనుభవాలే తనకు పాఠాలని తెలిపాడు. ప్రస్తుతం తాను హీరోగా, నిర్మాతగా ఈ స్థాయిలో ఉండటానికి తండ్రి జీవితంలో జరిగిన సంఘటనలే అని వెల్లడించాడు. రోడ్డున పడే పరిస్థితి నుంచి ఇప్పుడు బాలీవుడ్ టాప్ సెలబ్రిటీల్లో ఒకరిగా నిలిచారు అమీర్. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనతో నటుడిగా, జీవితంలో వ్యక్తిగా ఉన్నతంగా నిలుస్తున్నారు అమీర్. ప్రస్తుతం ఆయన `లాల్ సింగ్ చద్దా` చిత్రంలో నటిస్తారు. దీంతోపాటు తనకు `3ఇడియట్స్`, `పీకే` లాంటి చిత్రాలను అందించిన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు అమీర్.