MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం భారీ తగ్గింపు

మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం భారీ తగ్గింపు

Fuel Tax Cut Explained : పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపును ప్రకటించింది. దీంతో సామాన్యులకు ఊరట లభించింది. దీంతో వాహనదారులకు కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం సహా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 30 2026, 10:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం గుడ్ న్యూస్
Image Credit : Getty

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం గుడ్ న్యూస్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల సామాన్యులపై పడే భారం తగ్గడమే కాకుండా, చమురు మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) కూడా కొంత వెసులుబాటు లభించనుంది.

26
చమురు సవరించిన రేట్లు ఇవే
Image Credit : Getty

చమురు సవరించిన రేట్లు ఇవే

కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 3కి తగ్గించారు. ఇక డీజిల్ విషయానికి వస్తే, దానిపై ఎక్సైజ్ సుంకాన్ని దాదాపు పూర్తిగా మినహాయించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడంతో, దేశీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు రక్షణ కవచంలా పనిచేయనుంది. చమురు కంపెనీలు తమ ముడిసరుకు ఖర్చులను తట్టుకుని, నష్టపోకుండా ఉండేందుకు ఈ సుంకం తగ్గింపు తోడ్పడుతుంది.

Related Articles

Related image1
గెటెడ్ కమ్యూనిటీనా లేక విదేశీ సరిహద్దా? హైదరాబాద్‌లో వైరల్ అవుతున్న అంకుల్ వీడియో !
Related image2
Car Mileage Tips : ఇలా చేయండి మీ కారు మైలేజ్ పెరుగుతుంది !
36
ప్రభుత్వ ఆదాయం.. పన్నుల లెక్కలు ఇవే
Image Credit : Getty

ప్రభుత్వ ఆదాయం.. పన్నుల లెక్కలు ఇవే

పెట్రోలియం రంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) గణాంకాల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ద్వారా ప్రభుత్వాలకు రూ. 7.5 ట్రిలియన్ల పన్ను ఆదాయం సమకూరింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాల ద్వారా ఏటా రూ. 2.7 నుంచి రూ. 3 ట్రిలియన్ల వరకు సంపాదిస్తోంది. రాష్ట్రాలు వ్యాట్ ద్వారా రూ. 3 ట్రిలియన్ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. కేంద్ర పన్నుల వాటా పెట్రోల్ ధరలో సుమారు 43 శాతం, డీజిల్ ధరలో 37 శాతంగా ఉంటోంది.

46
చమురు ధరలు : ఎక్సైజ్ సుంకం, సెస్ విభజన లెక్కలు ఇవే
Image Credit : Getty

చమురు ధరలు : ఎక్సైజ్ సుంకం, సెస్ విభజన లెక్కలు ఇవే

కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులలో ప్రాథమిక ఎక్సైజ్ సుంకంతో పాటు రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్ వంటివి ఉంటాయి. ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కేంద్రానికే చెందుతుంది, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది కేంద్రం, రాష్ట్రాల మధ్య తరచుగా చర్చనీయాంశమవుతోంది. కేంద్రం తన పన్ను నిర్మాణంలో సెస్, సర్ఛార్జ్ వాటాను పెంచుతుండటం పట్ల రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే విభజించదగిన పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా దక్కుతుంది, కానీ సెస్ విషయంలో అది వర్తించదు.

56
చమురు పై పన్ను తగ్గింపు: ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం
Image Credit : Getty

చమురు పై పన్ను తగ్గింపు: ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం

ధరల తగ్గింపు ప్రజలకు ఆనందాన్ని కలిగించినప్పటికీ, ప్రభుత్వ ఖజానాపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మార్కెట్ అంచనాల ప్రకారం, లీటరుకు ఒక రూపాయి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే, ప్రభుత్వానికి ఏడాదికి రూ. 14,000 నుంచి రూ. 16,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుంది. దీని ప్రకారం, ఇప్పుడు ప్రకటించిన రూ. 10 తగ్గింపు వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. 1.5 ట్రిలియన్ల ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ ఆర్థిక లోటు లక్ష్యాలపై ఒత్తిడి పెంచవచ్చు.

66
ద్రవ్యోల్బణం, సామాన్యుని బడ్జెట్
Image Credit : Getty

ద్రవ్యోల్బణం, సామాన్యుని బడ్జెట్

ఇంధన ధరలు నేరుగా రవాణా ఖర్చులపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా మారుతుంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పెరుగుతున్న అంతర్జాతీయ ధరల నుండి వినియోగదారులను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఈ పన్ను తగ్గింపు సామాన్యుల ఇంటి బడ్జెట్‌కు పెద్ద ఊరటనిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు 107.46. అలాగే, డీజిల్ ధర 95.70 గా ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: మహిళలు రోజుకు 2 గంటలు పని చేస్తే చాలు.. నెలకు రూ. 40 వేలు సంపాదిస్తారు.. ఎలాగంటే.?
Recommended image2
Money: డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఈ ఐదు విషయాలు తెలుసుకోండి.!
Recommended image3
Today Gold Rate: టర్కీ నిర్ణయానికి బంగారం మార్కెట్లు కుదేలు...పసిడి ప్రియులకు మాత్రం పండగే
Related Stories
Recommended image1
గెటెడ్ కమ్యూనిటీనా లేక విదేశీ సరిహద్దా? హైదరాబాద్‌లో వైరల్ అవుతున్న అంకుల్ వీడియో !
Recommended image2
Car Mileage Tips : ఇలా చేయండి మీ కారు మైలేజ్ పెరుగుతుంది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved