Guru Shukra Gochar: 3 రోజులు ఓపికపడితే.. ఈ రాశుల జీవితాల్లో మ్యాజిక్ జరగడం ఖాయం..!
Guru Shukra Gochar: జోతిష్యశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి 23న గురు, శుక్ర గ్రహాలు ఒకరికొకరు 120 డిగ్రీల వద్ద కలుసుకుంటారు. దీని వల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు తెస్తుంది.

Jupiter venus Transit
వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, గురు గ్రహం అత్యంత ప్రభావవంతమైన, శుభ గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ గురుు గ్రహం సాధారణంగా సంవత్సరానికి ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటుంది. కాగా, ఈ గురు గ్రహం మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 23వ తేదీన శుక్ర గ్రహంతో 120 డిగ్రీల కోణం వద్ద కలవనుంది. దీని కారణంగా.. నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభ యోగం. దీని వల్ల మూడురాశుల వారి అదృష్టం రెట్టింపు కానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...
1.మీన రాశి...
గురు-శుక్రుల నవ పంచమ రాజయోగం మీన రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చేయనుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భౌతిక సుఖాలు పొందుతారు. అంతేకాదు.. ఈ నవ పంచమ రాజయోగం కారణంగా ఈ రాశివారు ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. ఉన్నత పదవులు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతంది. చాలా కాలంగా మీరు చేస్తున్న పనిలో గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్థులకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
2.కర్కాటక రాశి...
గురు, శుక్రుడు కలిసి ఏర్పరుస్తున్న నవ పంచమ రాజయోగం కర్కాటక రాశివారికి కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో ఈ రాశివారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఏ పని చేసినా విజయం సాధించగలరు. ఈ సమయంలో ఈ రాశివారి నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి. జీవితానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది.
3.కుంభ రాశి..
నవ పంచమ రాజయోగం కుంభ రాశివారికి అనేక రంగాలలో ప్రయోజనాలను తెస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. కెరీర్ లో మంచి అవకాశాలు లభిస్తాయి. పనిలో పురోగతి ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి గౌరవం, ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నవారికి ఇది సరైన సమయం. ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

