MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Mega Parent-Teacher Meeting: స్కూళ్లు, కాలేజీలకు కీలక ఆదేశాలు

Mega Parent-Teacher Meeting: స్కూళ్లు, కాలేజీలకు కీలక ఆదేశాలు

Mega parent teacher meeting: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం జూలై 5న స్కూల్స్, జూలై 10న కాలేజీల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనుంది. 2 కోట్లకు పైగా ప్రజలు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 01 2025, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్కూల్లు, కాలేజీల్లో మెగా పేరెంట్ మీటింగ్
Image Credit : Google

స్కూల్లు, కాలేజీల్లో మెగా పేరెంట్ మీటింగ్

Ap mega parent teacher meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జూలై లో రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లను ప్లాన్ చేసింది. జులై 5, 2025న రాష్ట్రవ్యాప్తంగా 61,000కి పైగా పాఠశాలల్లో మేగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) నిర్వహించనుంది. సమగ్ర శిక్షా అభియాన్, జాతీయ విద్యా విధానం (NEP) 2020కు అనుగుణంగా ఈ కార్యక్రమం రూపొందించారు. విద్యార్థుల విద్యా పురోగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పెద్ద సంఖ్యలో పాల్గొననున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
Image Credit : ANI

పెద్ద సంఖ్యలో పాల్గొననున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు

ఈ పీటీఎంలో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కమ్యూనిటీ సభ్యులు పాల్గొననున్నారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద విద్యా సంబంధిత కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు సాధించనుంది. 

ఈ సమావేశాల ద్వారా పాఠశాలలు, తల్లిదండ్రుల మధ్య నేరుగా సమాచార మార్పిడి సాధ్యమవుతుందని, విద్యార్థుల పురోగతిలో పారదర్శకత, బాధ్యతాభావం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Related Articles

Related image1
Bank Holidays: జూలైలో బ్యాంకులకు ఇన్ని సెలవులా? ఉద్యోగులకు పండగే.. బ్యాంకు పనులు ముందే ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఇబ్బందులే
Related image2
Birth Month: ఈ మూడు నెలల్లో జన్మించినవారికి జులై నెల అదృష్టాన్ని తెస్తుంది..!
36
జూనియర్ కాలేజీల్లో కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
Image Credit : ANI

జూనియర్ కాలేజీల్లో కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

జులై 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించాలని ఆంధ్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వం జూనియర్ కాలుజీలతో పాటు ప్రయివేటు, ఎయిడెడ్, జూనియర్ కాలుజీల్లో మెగా పెరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగే ఈ బహిరంగ సమావేశంలో విద్య, మౌలిక సదుపాయాలు, వసతులు, కార్యచరణ ప్రణాళికలను వివరిస్తారు. పిల్లల మానసిక ఆరోగ్యం, పురోగతిపై సెషన్లు, ఆటల పోటీలు కూడా నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

46
ఏపీలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో చర్చించనున్న అంశాలు ఇవే
Image Credit : ANI

ఏపీలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో చర్చించనున్న అంశాలు ఇవే

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో విద్యార్థుల అకడమిక్ పనితీరు, హాజరు అంశాలు, పాఠశాల, కాలేజీల వసతుల అవసరాలు, తల్లిదండ్రులు-స్థానికుల అభిప్రాయాలు వంటి అంశాలపై చర్చ జరగనుంది. పాఠశాల స్థాయి సమావేశంగా మాత్రమే కాకుండా, ఇది సముదాయంతో విద్యా పరమైన సంభాషణగా మారనుంది.

56
ప్రభుత్వ ప్రతినిధుల భాగస్వామ్యంతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
Image Credit : ANI

ప్రభుత్వ ప్రతినిధుల భాగస్వామ్యంతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

ప్రతీ జిల్లాలో విద్యా అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇది ప్రభుత్వ, పాఠశాల, సముదాయం మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ కూడా ప్రకటన చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. "తల్లిదండ్రుల భాగస్వామ్యం విద్యార్థి విజయానికి కీలకం. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలతో కుటుంబాల మధ్య నమ్మకాన్ని బలపరచగలుగుతాం" అని తెలిపారు.

66
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు
Image Credit : ANI

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు

పెద్ద సంఖ్యలో హాజరయ్యే తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మీటింగ్ సమయాలు, పలు భాషలలో సమాచార పత్రాలు అందించడం ద్వారా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య సమానత తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పేరెంట్-టీచర్ మీటింగ్ ద్వారా విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్రను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
విద్య
ఏషియానెట్ న్యూస్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert: రెండు ద్రోణుల ఎఫెక్ట్.. రెండ్రోజులు భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్
Recommended image2
Now Playing
జనసైనికులకు పూనకాలు తెప్పించే పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Deputy CM Pawan Kalyan Speech | Asianet Telugu
Recommended image3
Now Playing
ఈ హాస్టల్లో వార్డెన్ తీరు చూసి ఫుడ్ కమీషన్ చైర్మన్ షాక్ | Ap State Food Commission Chairman
Related Stories
Recommended image1
Bank Holidays: జూలైలో బ్యాంకులకు ఇన్ని సెలవులా? ఉద్యోగులకు పండగే.. బ్యాంకు పనులు ముందే ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఇబ్బందులే
Recommended image2
Birth Month: ఈ మూడు నెలల్లో జన్మించినవారికి జులై నెల అదృష్టాన్ని తెస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved