డైరెక్ట్ ఓటీటీకి.. మరో తెలుగు సినిమా
థియోటర్స్, సినిమాలు రిలీజ్ లేకపోవటంతో జనాలు ఇంట్లోనే ఉంటూ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నష్టం వచ్చినా సరే ఓటీటిలకే ఇవ్వటానికి నిర్మాతలు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు కారణం తాము సినిమా నిర్మాణం కోసం ఫైనాన్సర్ల దగ్గర తెచ్చిన డబ్బుకు వడ్డీ పెరిగిపోతోంది. దాంతో ముందు వడ్డీల నుంచైనా బయిటపడచ్చు కదా అని అన్నీ పూర్తై రిలజ్ కు సిద్దమైన సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్స్లో నేరుగా రిలీజ్ కు ఇచ్చేస్తున్నారు .
లాక్ డౌన్ దెబ్బతో అందరూ నష్టపోయినా ఓటీటీ ప్లాట్ ఫామ్స్కు మాత్రం లాభాలు స్టార్ట్ అయ్యాయి. ఊహించని విధంగా ప్రేక్షకాదరణ తెగ పెరిగిపోయింది. థియోటర్స్, సినిమాలు రిలీజ్ లేకపోవటంతో జనాలు ఇంట్లోనే ఉంటూ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నష్టం వచ్చినా సరే ఓటీటిలకే ఇవ్వటానికి నిర్మాతలు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు కారణం తాము సినిమా నిర్మాణం కోసం ఫైనాన్సర్ల దగ్గర తెచ్చిన డబ్బుకు వడ్డీ పెరిగిపోతోంది. దాంతో ముందు వడ్డీల నుంచైనా బయిటపడచ్చు కదా అని అన్నీ పూర్తై రిలజ్ కు సిద్దమైన సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్స్లో నేరుగా రిలీజ్ కు ఇచ్చేస్తున్నారు .
చాలా మంది నిర్మాతలు అమేజాన్, , నెట్ ఫ్లిక్స్, జీ-5, సన్ నెక్స్ట్, ఆహా, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ పామ్స్లో సినిమాల విడుదలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే గులాబో సిటావో, పొన్ మగల్ వంధల్ (తమిళం), ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ), శకుంతలాదేవీ(హిందీ), సుఫియాం సుజాతాయం(మళయాళం), లక్ష్మీ బాంబ్ (హిందీ).. చిత్రాలు కూడా ఓటిటి రిలీజ్ లకు రెడీ అయ్యాయి.ఈ క్రమంలోనే మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ నటించిన పెంగ్విన్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతుంది. అలాగే ఇఫ్పుడు మరో తెలుగు సినిమా కూడా ఓటీటి దారే వెతుక్కుంది.
ఆ సినిమా టైటిల్ 47 డేస్. సత్యదేవ్ హీరోగా ప్రదీప్ మద్దాలి అనే కొత్త దర్శకుడు రూపొందించిన థ్రిల్లర్ మూవీ 47 డేస్. ఈ సినిమా త్వరలోనే జీ5లో రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దాదాపు ఏడాది కిందటే ఈ చిత్రం పూర్తయింది. రిలీజ్ విషయంలో సమస్యలెదుర్కొంది. ఇక రిలీజ్ కష్టం అనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఓ రకంగా ఈ సినిమాకు ఓటీటి అనేది కలిసివచ్చిన అంశమే కావటం విశేషం.