టీమ్లో వ్యక్తికి ‘కరోనా’ వార్తపై ... వర్మ స్పందన
టీమ్ లోకి మిగిలిన సభ్యులకూ కరోనా టెస్టులు చేయిస్తున్నారని వార్తలు సారాంశం. అంతేకాదు... మరి వర్మ టెస్టులు చేయించుకుంటాడో లేదో? అని కొందరు మీడియావారి క్వచ్చిన్ మార్క్. అయితే ఈ వార్త విషయం వర్మను చేరింది. ఆయన వెంటనే స్పందించారు. ఈ వార్తను ఖండించారు.
నిన్నటి నుంచీ మీడియా వర్గాల్లో, వెబ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు..రామ్ గోపాల్ వర్మ యాక్షన్ టీమ్ లో ఓ కీలకమైన సభ్యుడికి కరోనా సోకింది. దాంతో వర్మ టీమ్ అలెర్ట్ అయిపోయి... ఎక్కడ పనులు అక్కడే ఆపేసినట్టు చెప్తున్నారు. టీమ్ లోకి మిగిలిన సభ్యులకూ కరోనా టెస్టులు చేయిస్తున్నారని వార్తలు సారాంశం. అంతేకాదు... మరి వర్మ టెస్టులు చేయించుకుంటాడో లేదో? అని కొందరు మీడియావారి క్వచ్చిన్ మార్క్. అయితే ఈ వార్త విషయం వర్మను చేరింది. ఆయన వెంటనే స్పందించారు. ఈ వార్తను ఖండించారు. అలాంటిదేమీ లేదని ఆయన ప్రకటన లాంటి ట్వీట్ చేసారు.
వర్మ మాట్లాడుతూ....“మా టీమ్ లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, దాంతో మేము షూటింగ్ ఆపు చేసామని వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. అయితే నిజం ఏమిటంటే...మేము షూటింగ్ కు ముందే మా టీమ్ లో అందరికీ కరోనా టెస్ట్ లు చేయించాం. అందరికీ నెగిటివ్ వచ్చాకే మేము షూటింగ్ స్టార్ట్ చేసాం. మేము పూర్తిగా గైడ్ లైన్స్ ఫాలో అవుతూనే షూటింగ్ చేస్తున్నాం,” అని అన్నారు. హైదరాబాద్ అవుటట్ స్కర్స్ మొయినా బాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో షూటింగ్ జరుపుతున్నట్లు వినికిడి.
ఇక కరోనాపై నాకేంటి అంటూ ఓ హారర్ టైప్ సినిమాని అదే కరోనా వైరస్ అనే టైటిల్ తో తీసిన ఘనత రామ్ గోపాల్ వర్మది. ఆయన లాక్ డౌన్ టైమ్ లో అందరూ సైలెంట్ గా ఉంటే తను మాత్రం వరస పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆయన ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఆయన లాక్ డౌన్ టైమ్ ని వృధాపోనివ్వకండా కరోనా వైరస్, నగ్నం అనే సినిమాలు తీసారు. క్లైమాక్స్, నగ్నం సినిమాలు రిలీజ్ చేసారు. ఇంకా నాలుగైదు ప్రాజెక్టులు వరసలో ఉన్నాయని వినికిడి. ఇక ప్రస్తుతం వర్మ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆ రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం తీస్తున్నవే.