Asianet News TeluguAsianet News Telugu

రూ. 200 కోట్ల నేరంలో బాధితురాలిగా పవన్ హీరోయిన్ జాక్విలిన్

రూ. 200కోట్ల రూపాయల రాకెట్ కి సంబంధించిన కేసులో జాక్విలిన్ విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఈ స్కామ్ లో జాక్విలిన్ కేవలం బాధితురాలు మాత్రమే, నేరంలో ఆమె ప్రమేయం లేదని అధికారులు వెల్లడించారు. 
 

pawan heroin Jacqueline Fernandez just a victim in rupees 200 crores racket
Author
Hyderabad, First Published Aug 31, 2021, 9:09 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించడం సంచలనంగా మారింది. రూ. 200కోట్ల రూపాయల రాకెట్ కి సంబంధించిన కేసులో జాక్విలిన్ విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఈ స్కామ్ లో జాక్విలిన్ కేవలం బాధితురాలు మాత్రమే, నేరంలో ఆమె ప్రమేయం లేదని అధికారులు వెల్లడించారు. 


సుఖేష్ చంద్రశేఖర్ అనేక చట్టవ్యతిరేక చర్యల ద్వారా రూ. 200కోట్ల మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. పలు సెక్షన్స్ క్రింద కేసులు సుఖేష్ పై నమోదు చేసిన అధికారులు, అతన్ని అరెస్ట్ చేసి రోహిణి జైలుకు తరలించారు. జాక్విలిన్ తన ఫ్రెండ్ లీనా పాల్ వలన వీళ్ళ ట్రాప్ లో చిక్కుకున్నట్లు అధికారుల సమాచారం. సుఖేష్ చంద్రశేఖర్ గురించిన సమాచారం కొరకే జాక్విలిన్ ని పోలీసులు విచారించారు. దాదాపు 5 గంటల పాటు సాగిన విచారంలో జాక్విలిన్ నుండి కీలక సమాచారం రాబట్టినట్లు అధికారులు వెల్లడించారు. 


ఆగస్టు 24న చెన్నైలో గల ఓ బంగ్లాలో రూ. 82.5 లక్షల నగదు, 12 లగ్జరీ కార్లను అధికారులు సీజ్ చేశారు. కుట్ర, మోసం, ఆర్ధిక నేరాలు వంటి అనేక సెక్షన్స్ క్రింద సుఖేష్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ టాప్ బాలీవుడ్ స్టార్ ని సుఖేష్ టార్గెట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా, హరి హర వీరమల్లు మూవీలో జాక్విలిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios