ప్రస్తుతం చాలా మంది నేతల పిల్లలు తన తండ్రికున్న అధికారం చూసుకొని పొగరుగా ప్రవర్తిస్తోన్న సందర్భాలు చాలానే చూశాం. కానీ అందరూ అలా ఉంటారని అనుకోకూడదు.

ప్రస్తుతం చాలా మంది నేతల పిల్లలు తన తండ్రికున్న అధికారం చూసుకొని పొగరుగా ప్రవర్తిస్తోన్న సందర్భాలు చాలానే చూశాం. కానీ అందరూ అలా ఉంటారని అనుకోకూడదు. ఓ ముఖ్యమంత్రి కుమారుడు ట్రాఫిక్ రూల్ అతిక్రమించాడని పోలీసులు ఆపితే అతడు దానికి చలానా కట్టి సైలెంట్ గా వెళ్లిపోయారట.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అతడు ఎవరో కాదు.. నందమూరి హరికృష్ణ. తన తండ్రి ముఖ్యమంత్రి అయినా..తలబిరుసుతనం లేకుండా ఒద్దికగా ప్రవర్తించిన హరికృష్ణ గురించి సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వెల్లడించారు. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో హరికృష్ణ కారులో వెళ్తున్నారట. ఆ సమయంలో ముషీరాబాద్ లోకి ఓ ట్రాఫిక్ సిగ్నల్ దాటారన్న కారణంతో పోలీసులు ఆయన్ని ఆపి చలానా రాశారట.

అయితే తాను ఎన్టీఆర్ కుమారుడనే విషయాన్ని వారికి చెప్పకుండా తన తప్పు తెలుసుకొని చలానా కట్టి వెళ్లిపోయారట. హరికృష్ణ అంత సాధారణంగా ఉండగలిగారు అంటూ కీరవాణి చెప్పుకొచ్చాడు.

Scroll to load tweet…

ఇవి కూడా చదవండి.. 

హరికృష్ణ గురించి ఎవరికీ తెలియని విషయాలు!

'ఏమోయ్ పోసాని.. నాకు డబ్బులివ్వవేంటి' అని హరికృష్ణ అడిగారు!

హరికృష్ణ నా సోదర సమానులు.. ఎమోషనల్ అయిన చిరంజీవి!

కౌగిలించుకుని జూ. ఎన్టీఆర్ ను ఓదార్చిన కేసిఆర్ (ఫొటోలు)

కారు నడుపుతూ చనిపోయారా..? నమ్మలేకపోతున్నా: దర్శకేంద్రుడు!

హరికృష్ణ మోసపోయారు.. పోసాని సంచలన కామెంట్స్!