అఫీషియల్: తెలుగులో మరో చిత్రం కమిటైన దుల్కర్
మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' సినిమాతో దుల్కర్ హిట్ కొట్టాడు. అంతేకాదు, ఈ సినిమాతో ఆయన తమిళ్ లో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 'మహానటి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యి క్లిక్ అయ్యాయి. ఈ మధ్య విడుదలయిన 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి సక్సెస్ ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
మలయాళంలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న యంగ్ హీరోల్లో ఒకరు దుల్కర్ సల్మాన్. మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' సినిమాతో దుల్కర్ హిట్ కొట్టాడు. అంతేకాదు, ఈ సినిమాతో ఆయన తమిళ్ లో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 'మహానటి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యి క్లిక్ అయ్యాయి. ఈ మధ్య విడుదలయిన 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి సక్సెస్ ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
ఈ క్రమంలో అప్పటి నుంచి స్ట్రైయిట్ గా ఓ తెలుగు సినిమా చేయాలని ఎదురు చూస్తున్న దుల్కర్ సల్మాన్ కు..మరో అవకాసం వచ్చింది. ఆయనకు హను రాఘవపూడి చెప్పిన స్క్రిప్ట్ నచ్చినట్లు సమాచారం. దుల్కర్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం తమిళ్ లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ని నిర్మాత అశ్వనిదత్ వెల్లడించారు. స్వప్న సినిమా ఈ ప్రాజెక్టుని త్వరలోనే పట్టాలు ఎక్కించనుంది.
కావాల్సినంత టాలెంట్ ఉన్నా సక్సెస్ లేని తెలుగు దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. ఫ్లాప్ డైరెక్టర్ గా ముద్ర పడిన హను రాఘవపూడి కు ఆఫర్స్ కు అయితే లోటు ఉండదు. ఈ చిత్రం ద్వారా అయినా హిట్ కొట్టి క్రేజీ దర్శకుల్లో ఒకడిగా నిలిచిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం పట్టాలెక్కనున్నదని సమాచారం.