టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ చేతికి పొన్నియిన్ సెల్వన్ తెలుగు హక్కులు
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న పొన్నియిన్ సెల్వన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగులో ఈ సినిమాపే హోప్స్ గట్టిగానే ఉన్నాయి. అది సరే మన టాలీవుడ్ లో ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
చాలా కాలం తరువాత సౌత్ సీనియర్ స్టార్ డైరెక్టర్ మణితర్నం నుంచి రాబోతున్న సినిమా పొన్నియన్ సెల్వన్. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో పొన్నియిన్ సెల్వన్ ఒకటి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా ఆయన సినిమాలు సౌత్ లో అన్ని లాంగ్వేజ్ లలో డబ్ అయ్యేవి కాని ఈసారి మాత్రం మల్టీ లాంగ్వేజ్ లో సినిమా చేశారు మణిరత్నం.
ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే పొన్నియన్ నుంచి రిలీజ్ అయిన అప్ డేట్స్ పోస్టర్లు, పాటలు సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచుతున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈసినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ మూవీ.. సెప్టెంబర్ 30 న రిలీజ్ కు రెడీ అవుతోంది. తను ఈ సినిమా చేయడానికి రాజమౌళే ఆదర్శం అంటూరీసెంట్ గా మనసులో మాట బయట పెట్టారు మణిరత్నం. ఈ కాలంలో కూడా జాపథ చిత్రాలను రాజమౌళి అందంగా చిత్రీకరించి.. ఆడియన్స్ చూసేలా చేస్తున్నారంటూ ఆకాశానికి ఎత్తారు.
ఆదైర్యంతోనే తాను కూడా ఈ సినిమాను చేశాన్ననారు మణిరత్నం. ఇక ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటి నుండే వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా అదే ప్రభావంచూపించే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా తెలుగు హక్కులను కూడా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. పొన్నియిన్ సెల్వన్ తెలుగు థియేట్రికల్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు దక్కించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఈ ఈ సినిమాను తెలుగులో దిల్రాజు రిలీజ్ చేయబోతున్నారు.
రాజ రాజ చోళ కి సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందింది.. ఇక ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. మొదటి భాగం సెప్టెంబర్ 30న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.