శిల్పాశెట్టి, రాజ్కుంద్రాలపై చీటింగ్ కేసు.. తన డబ్బుతో పోర్న్ సినిమాలు తీశారంటూ..
నటి శిల్పాశెట్టి దీన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. రాజ్కుంద్రాకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై మరో చీటింగ్ కేసు నమోదైంది.
బాలీవుడ్లో పోర్నోగ్రఫీ కేసు పెద్ద దుమారం సృష్టించింది. `బాలీవుడ్ డర్టీ` అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యేంతగా సంచలనం సృష్టించింది. ఇందులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ ఇచ్చేందుకు కోర్ట్ నిరాకరిస్తుంది. ఈ నేపథ్యంలో నటి శిల్పాశెట్టి దీన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. రాజ్కుంద్రాకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ క్రమంలో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై మరో చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారంలో పెట్టుబడి పెడతానని చెప్పి తన దగ్గర రూ.41 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్ గోయెల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ డబ్బును అడల్ట్ మూవీస్ తీసేందుకు ఉపయోగించారని ఆరోపించాడు. స్వలాభం కోసం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా చాలామంది దగ్గర డబ్బు తీసుకుని, వాటి ద్వారా పోర్న్ వీడియోలు తీశారని ఆరోపణలు చేశాడు.
దీనిపై ఢిల్లీ పోలీసులు ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో శిల్పాశెట్టి దంపతులతో పాటు నందన మిశ్రా, దర్శిత్ షా, ఎమ్కే మధ్వా, సత్యేంద్ర సరుప్రియ, ఉమేశ్ గోయాంక పేర్లున్నాయి. అయితే రోజులు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సదరు వ్యాపారవేత్త ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మన్సి మాలిక్.. పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించాడు. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేశారు. ఇప్పటికే ఉన్న కేసుల నుంచి బయటపడలేకపోతున్న రాజ్కుంద్రాకి ఇప్పుడు మరో కేసు చుట్టుకోవడం విచారకరం.