కోర్టుకి హాజరైన హీరో విశాల్!
నటుడు విశాల్ చెన్నై, ఎగ్మూర్ కోర్టుకి హాజరుకాక తప్పలేదు. దాదాపు కోటి రూపాయల వరకు సేవా పన్ను శాఖ అధికారులకు విశాల్ పన్ను చెల్లించని కారణంగా రెండేళ్ల క్రితం ఆయనకి నోటీసులు పంపారు.
నటుడు విశాల్ చెన్నై, ఎగ్మూర్ కోర్టుకి హాజరుకాక తప్పలేదు. దాదాపు కోటి రూపాయల వరకు సేవా పన్ను శాఖ అధికారులకు విశాల్ పన్ను చెల్లించని కారణంగా రెండేళ్ల క్రితం ఆయనకి నోటీసులు పంపారు.
అంతేకాదు.. విశాల్ స్వయంగా సేవా పన్ను శాఖ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే విశాల్ హాజరు కాకుండా.. ఆయన ఆడిటర్, లాయర్ మాత్రం హాజరవుతున్నారు. దీంతో సేవా పన్ను అధికారులు చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకి రావడంతో నటుడు విశాల్ కోర్టుకి హాజరుకాక తప్పలేదు.
ఈ విషయాన్ని అతడి లాయర్లు చార్లెస్ డావిన్, ప్రవీణ్ కుమార్ లు ఓ ప్రకటనలో పేర్కొంటూ వెల్లడించారు. ఫార్మాలిటీ కోసమే విశాల్ కోర్టుకి హాజరైనట్లు తెలిపారు. ప్రస్తుతం విశాల్ నటించిన 'పందెంకోడి2' థియేటర్లలో సందడి చేస్తుంది. తమిళంలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండగా.. తెలుగు మాత్రం ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోతుంది!
ఇవి కూడా చదవండి..
ప్రీమియర్ షో టాక్: పందెం కోడి 2
విశాల్ కి మళ్లీ దెబ్బ పడుతుందా..?
రామ్ వర్సెస్ విశాల్.. తేడా వస్తే కష్టమే!