Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్: పేదలకు కూరగాయలు పంచిన సర్పంచ్

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణలోని మట్టంపల్లి మండల కేంద్రం సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.
Mattampalli Sarpanch Mannem Srinivas Reddy distributes vegetables
Author
Mattampally, First Published Apr 16, 2020, 4:53 PM IST
మట్టంపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లా మట్టంపల్లి మండల కేంద్రం సర్పంచ్  ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ జరిగింది. మట్టంపల్లి గ్రామంలో పేదలకు కూరగాయలను  గ్రామ సర్పంచ్  మన్నెం శ్రీనివాసరెడ్డి  పేదలకు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ లో ఉన్న పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ పనిచేస్తున్నట్లు చెప్పారు. పుట్టి పెరిగిన గ్రామానికి 
తనవంతు భాద్యత గా సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్ కొత్తపల్లి అశోక్, పిఎసీఎస్ డైరెక్టర్ కొమ్ము కరుణ సైదులు, పొట్ట వెంకన్న, మన్నెం అనిల్ రెడ్డి, ఆరాల సైదులు ,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Follow Us:
Download App:
  • android
  • ios