టీ20 వరల్డ్కప్ 2021: లంక బౌలర్ల ధాటికి నమీబియా విలవిల... శ్రీలంక ముందు ఈజీ టార్గెట్...
19.3 ఓవర్లలో 96 పరుగులకి ఆలౌట్ అయిన నమీబియా... శ్రీలంక ముందు ఈజీ టార్గెట్.. మూడు వికెట్లు తీసిన తీక్షణ...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఎలిమినేటర్ మ్యాచ్లో లంక బౌలర్లు, పసికూన నమీబియాను ఆటాడుకున్నారు. టాస్ గెలిచి, ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది లంక జట్టు. స్టీఫన్ బార్డ్ 7, జేన్ గ్రీన్ 8 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్లో పెవిలియన్ చేరగా, 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన నమీబియా... నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది.
Must Read: టీ20 వరల్డ్కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...
క్రెగ్ విలియమ్స్ 36 బంతుల్లో 2 సిక్సర్లతో 29 పరుగులు చేయగా, ఎరాస్మస్ 19 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన నమీబియా, 19.3 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
లంక బౌలర్లలో మహీష్ తీక్షణ 3 వికెట్లు తీయగా, లహీరు కుమార, వానిందు హసరంగ రెండేసి వికెట్లు తీశారు. ఛమీర కరుణరత్నే, దుస్మంత ఛమీరా చెరో వికెట్ తీశారు...
ఇవీ చదవండి: INDvsENG వార్మప్ మ్యాచ్: భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్... మూడు వికెట్లు తీసిన మహ్మద్ షమీ...
ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...