INDvsENG వార్మప్ మ్యాచ్: భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్... మూడు వికెట్లు తీసిన మహ్మద్ షమీ...
మూడు వికెట్లు తీసిన మహ్మద్ షమీ, రాహుల్ చాహార్, జస్ప్రిత్ బుమ్రాలకు చెరో వికెట్... బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ మెరుపులతో భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఇంగ్లాండ్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో పర్పామెన్స్ ఇవ్వలేకపోయారు. మమ్మద్ షమీ ఒక్కడు మూడు వికెట్లు తీసి అదరగొట్టినా... భారీగా పరుగులు సమర్పించాడు. అశ్విన్తో పాటు భువనేశ్వర్ కుమార్ వికెట్లు తీయలేకపోయాడు...
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. జాసన్ రాయ్, జోస్ బట్లర్ కలిసి తొలి వికెట్కి 36 పరుగులు జోడించారు. 13 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన జోస్ బట్లర్ను మహ్మద్ షమీ క్లీన్బౌల్డ్ చేశాడు.. ఆ తర్వాత 13 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన జాసన్ రాయ్ కూడా షమీ బౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు...
18 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన డేవిడ్ మలాన్ని రాహుల్ చాహార్ బౌల్డ్ చేశాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 30 పరుగులు చేసిన లియాన్ లివింగ్స్టోన్ కూడా షమీ బౌలింగ్లోనే క్లీన్బౌల్డ్ అయ్యాడు... 36 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్తో 49 పరుగులు చేసిన బెయిర్స్టోని బుమ్రా అవుట్ చేశాడు.
భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీసినా నాలుగు ఓవర్లలో 40 పరుగులు సమర్పించాడు. బుమ్రా, రాహుల్ చాహార్ చెరో వికెట్ తీయగా... ఆఖరి ఓవర్లో 21 పరుగులు సమర్పించిన భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించాడు...ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదిన మొయిన్ ఆలీ, 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.