Asianet News TeluguAsianet News Telugu

కల్వకుర్తిలో కరోనా పాటిజిటి కేసు: జిల్లాలో 11 మంది అనుమానితులు

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లాలో 11 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరంతా ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరై వచ్చినవారే.

Coronavirus: positive case recorded at Kalvakurthi
Author
Kalwakurthy, First Published Mar 31, 2020, 5:31 PM IST

నాగర్ కర్నూలు: తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తాజాగా కరోనా పాజిటివ్ కేసు రికార్డయింది. అతన్ని హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని 11 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వీరంతా ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు హాజరై వచ్చినవారే. 

ఈ కేసుతో తెలంగాణలో ఇప్పటి వరకు 77 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఆరుగురిలో నలుగురు ఢిల్లీలోని ప్రార్థనా కార్యక్రమానికి వెళ్లి తిరిగి వచ్చినవారే. ఇదిలా వుంటే, ఇండోనేషియా నుంచి వచ్చిన వారిని కరోనా నెగెటివ్ రావడంతో హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 

తెలంగాణలో జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కోసం తెలంగాణ ప్రభుత్వం జల్లెడ పడుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని చెక్ పోస్టు వద్ద లోనికి రావడానికి ప్రయత్నించిన 32 మందిని అడ్డుకున్నారు. 

వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసేయడంతో పలువురు మతిస్థిమితం కోల్పోయి హైదరాబాదులోని మానసిక చికిత్సాలయానికి చేరుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో మతిస్థిమితం కోల్పోయి ఐదుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios