బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పోలీసులు తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, హర్ష సాయి తదితరులపై గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. చాలామంది ప్రముఖులు ప్రమోట్ చేస్తుంటే తాను చేయడంలో తప్పేముందని హర్ష సాయి అన్నారు. బెట్టింగ్ యాప్ల వల్ల తెలంగాణలో చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు.