బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని బాలీవుడ్లో సన్నీ డియోల్తో ‘జాట్’ సినిమా చేస్తున్నారు. సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవర్ఫుల్ డైలాగ్లు, యాక్షన్ సన్నివేశాలతో విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది.