మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్లో 'L2E: ఎంపురాన్' మార్చి 27న విడుదల కానుంది. 2019లో వచ్చిన 'లూసిఫర్' చిత్రానికి ఇది సీక్వెల్. రాజకీయ వ్యూహాలు, హీరోయిజంతో కూడిన సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. శత్రువులను హీరో ఎలా ఎదుర్కొంటాడనేది కథాంశం. ఈ చిత్రంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్ర పోషించారు. సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.