ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ ముగ్గురు యువకులను నడి రోడ్డుపై కూర్చొబెట్టి లాఠీలతో బడితే పూజ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గత నెలలో గుంటూరు జిల్లాలోని ఇథానగర్లో ఒక పోలీసు కానిస్టేబుల్పై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని టెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో చెబ్రోలు జాన్ విక్టర్ (25), షేక్ బాబులాల్ (21), డోమా రాకేష్ (25) ఉన్నారు.
తెనాలి టూ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాములు నాయక్ తెలిపిన ప్రకారం, నెల క్రితం ఈ ముగ్గురు, మరో వ్యక్తి ‘కిల్లర్’తో కలిసి గంజా సేవించి మత్తులో కానిస్టేబుల్ కన్న చిరంజీవిపై దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
నిందితులను ఆదివారం అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. అయితే, అరెస్టు సమయంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో నిందితులను నేలపై కూర్చోబెట్టి పోలీసులు వారి కాళ్లపై బలంగా కొడుతూ కనిపించారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సంఘటనపై రెండు రకాల వాదనాలు వనిపిస్తున్నాయి. కొందరు నిందితుల క్రిమినల్ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులను సమర్థించగా, మరికొందరు ఇలా భౌతిక దాడికి దిగడం సరైంది కాదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ అధికారి రాములు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం. నిందితుల్లో ఒకరైన జాన్ విక్టర్పై మొత్తం 9 కేసులు ఉన్నాయని, వీటిలో ఒక హత్యాయత్నం కేసు కూడా ఉందని తెలిపారు. అలాగే రాకేష్పై 6 కేసులున్నాయి. కానిస్టేబుల్పై జరిగిన దాడిలో బాబులాల్ పాత్ర ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు.