Asianet News TeluguAsianet News Telugu

బాలాజీ జిల్లాలో దారుణం : బాలికకు మత్తు ఇంజెక్షన్.. కిడ్నాప్, ఆపై గ్యాంగ్‌రేప్

తిరుపతి జిల్లాలో  ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Minor girl abducted and gang-raped by three youths in sri balaji district
Author
First Published Sep 1, 2022, 8:26 PM IST

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని కేవీబీ పురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాధితురాలికి నిందితులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. గ్యాంగ్‌రేప్‌కు ఒడిగట్టారు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే వున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios