విజయవాడ సెంట్రల్ సీటుపై తేల్చేసిన రాధా, తొందరొద్దన్న మాజీ మంత్రి
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మాజీ మంత్రి పార్థసారథి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు సూచించారు
విజయవాడ: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మాజీ మంత్రి పార్థసారథి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు సూచించారు. వైసీపీ అధిష్టానం తరపున పార్థసారథి రాధాతో చర్చించారు.
వంగవీటి రాధాతో మాజీ మంత్రి పార్థాసారథి గురువారం నాడు సమావేశమయ్యారు. విజయవాడ సెంట్రల్ సీటు విషయమై వైసీపీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో పార్థసారథి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో మల్లాది విష్ణు వైపుకు ఎందుకు మొగ్గుచూపాల్సి వచ్చిందనే విషయాన్ని పార్థసారథి వివరించారు. అంతేకాదు విజయవాడ తూర్పు సీటు విషయాన్ని పార్టీ ఎందుకు రాధాకు సూచించిందనే విషయాన్ని పార్థసారథి వివరించినట్టు సమాచారం.
అయితే ఈ పరిణామాల నేపథ్యంలో తాను సెంట్రల్ సీటు విషయాన్ని వదులుకొనే ప్రసక్తే లేదని వంగవీటి రాధా పార్థసారథికి చెప్పినట్టు సమాచారం.అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని రాధాకు పార్థసారథి వివరించినట్టు సమాచారం.
సంబంధిత వార్తలు
వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?
వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు
వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ
వంగవీటి రాధాకు మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు
వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...
వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్లోకి టీడీపీ?
వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు
వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా
వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత
జనసేనలోకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్..