
Botsa Satyanarayana: అమరావతి పేరుతో ‘అంతులేని దోపిడీ’ చంద్రబాబుపై బొత్స సెటైర్లు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.