Oct 21, 2020, 12:41 AM IST
గత మ్యాచ్లో డబుల్ సూపర్ ఓవర్ విక్టరీ ఇచ్చిన నూతన ఉత్సాహంతో సీజన్లో తొలిసారిగా రెండు వరుస మ్యాచుల్లో గెలిచి, ప్లేఆఫ్ రేసులో నిలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 165 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కెఎల్ రాహుల్ వికెట్ను త్వరగా కోల్పోయింది.పూరన్, గేల్ ఇన్నింగ్స్ల కారణంగా చేయాల్సిన రన్రేట్ భారీగా పడిపోవడంతో దీపక్ హుడా, జేమ్స్ నిషమ్ కలిసి ఈజీగా ఇన్నింగ్స్ ముగించారు. ఈ విజయంతో నాలుగో విజయం అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.