నిఖిల్ వర్సెస్ గౌతమ్ - పృధ్వీ వర్సెస్ మణికంఠ, బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల రచ్చ..

First Published Oct 18, 2024, 12:53 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రచ్చ అంతా ఇంతా కాదు.ఎప్పుడు గొడవ అవుతుందా.. ఎప్పుడు కామ్ గా ఉంటారా తెలియక ఆడియన్స్ సతమతం అవుతున్నారు. ఈక్రమంలో ఓవర్ స్మార్ట్ గేమ్ కాస్త.. ఓవర్ ఫైట్ గేమ్ గా మారిపోయింది. 

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఏడో వారం టాస్క్ ల రచ్చ కొనసాగుతోంది. రాయల్ క్లాన్ పేరుతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పాత కంటెస్టెంట్లు 8 మంది మధ్య.. ఓజీ క్లాన్ నలిగిపోతున్నారు. ఇక ప్రస్తుతం హౌస్ లో  ఓవర్ స్మార్ట్ టాస్క్ రన్ అవుతోంది. ఫోన్‌లుగా రాయల్ క్లాన్.. ఛార్జింగ్‌లు ఓజీ క్లాన్‌ను డివైడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో టాస్క్ కంటిన్యూ అయింది. కాస్త గొడవలు.. బ్రతిమలాడటాలు.. అలా రకరకాలుగా ఈ టాస్క్ కొనసాగుతోంది. 

ఇక ఎవరికి వారు బేరాలు ఆడుతూ... గేమ్ ను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నబిల్‌ రెండోసారి కూడా దెబ్బతిన్నాడు. ఆదమరిచి ఉండటంతో నబిల్ దగ్గర నుంచి చార్చిం పొందారు ముక్కు అవినాశ్, మరియు టేస్టీ తేజ ఛార్జింగ్ కొట్టేశాడు. అంతే కాదు మణికంఠ  నుంచి మోహబూబ్ కూడా చార్జింగ్ కొట్టేశాడు. స్మోకింగ్ అలవాటు ఉండటంటో..  లైటర్‌ను అడ్డు పెట్టుకుని రోహిణి, తేజలు ఛార్జింగ్ పాయింట్లు సంపాదించుకున్నారు. 

ఛార్జింగ్ కుండ పగలగొట్టిన కారణంగా ఓజీ క్లాన్ నుంచి ఓ సభ్యుడ్ని ఎలిమినేట్ చేయాలని  రాయల్ క్లాన్‌కు సూచించాడు బిగ్ బాస్. ఆ పేరు కూడా వారినే చెప్పమన్నారు. దాంతో వీరు పృధ్వీ ని బయటకుపపించేశారు. 

ఇక సడెన్ గా ఓజీ క్లాన్ బాత్రూం ఏరియాలోకి చొచ్చుకుపోయారు. దీంతో అక్కడ పెద్ద యుద్దమే జరిగింది. గౌతమ్, నిఖిల్‌లు కొట్టేసుకున్నారు. గౌతమ్ నిఖిల్ గొంతుపై చేయివేయడంత.. నిఖిల్ గౌతమ్ నుసోఫాలోకి నెట్టేశాడు. ః

లైటర్‌తో ఛార్జింగ్ పాయింట్లు సంపాదించాలని హరితేజ డీల్ పెట్టుకుంది. కానీ ఆ లోపే రోహిణి లైటర్ కొట్టేసింది. పృథ్వీకి ఒకసారి లైటర్ ఇచ్చి.. ఒక ఛార్జింగ్ పాయింట్ సంపాదించుకుంది. దీంతో హరితేజ హర్ట్ అయింది. 
మణికంఠ ఈ ఫిజికల్ టాస్కులని చూసి భయపడ్డాడు. ఇంతలా ఆడితే..ఏమైనా జరిగితే.. చేతులు, కాళ్లు విరిగితే ఎలా? అంటూ.. తనని ఆట నుంచి తప్పించమని రాయల్ క్లాన్‌తో డీల్ పెట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పృథ్వీని రాయల్ క్లాన్ తప్పించింది. 

ఇక కామ్ గా ఉన్న మణికంఠ దగ్గరకు వచ్చి కూర్చుకన్నాడు పృధ్వీ మెచ్యుర్‌గా ఉండమని చెప్పావు. దాని అర్థమేంటి అని అనవసరంగా గెలికాడు పృద్వీ. నాకు గొడవపెట్టుకోవాలని లేదు అంటూ టాపిక్‌ను మొదట్లోనే ఆపేద్దామనుకున్నాడు మణికంఠ. 

Latest Videos


ఇక కామ్ గా ఉన్న మణికంఠ దగ్గరకు వచ్చి కూర్చుకన్నాడు పృధ్వీ మెచ్యుర్‌గా ఉండమని చెప్పావు. దాని అర్థమేంటి అని అనవసరంగా గెలికాడు పృద్వీ. నాకు గొడవపెట్టుకోవాలని లేదు అంటూ టాపిక్‌ను మొదట్లోనే ఆపేద్దామనుకున్నాడు మణికంఠ. 

మణికంఠకు బాగా ఆకలేస్తోంది. తన ప్యామిలీ కూడా గుర్తుకొచ్చినప్పుడు డౌన్ అవుతున్నాడు. తన హల్త్ కూడా సరిగ్గా లేదు. ఈ టైమ్ లో తనను అలా ఎందుకు అన్నావో చెప్పమని ఒత్తిడి తీసుకొచ్చాడు పృథ్వి.  ఇక వెంటనే ప్రెజర్ తట్టుకోలేక  ఫైర్ అయిపోయిన మణికంఠ.. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అంటూ గట్టిగా ఇచ్చేశాడు 

నువ్వు ఎవ్వడివి.. నీకెందుకు నేను మెల్లగా చెప్పాలి..నువ్వుమైన నా అన్నవా.. నువ్వేమైనా డాన్‌వా? పైనుండి దిగొచ్చావా? ఈరోజు ఉదయం కూడా గ్లాస్‌లో నీళ్లు తీసుకురమ్మని చెప్పినప్పుడు నీ యాటిట్యూడ్ గమనించాను’ అంటూ ఫ్లోలో అనాల్సిన మాటలన్నీ అనేశాడు మణికంఠ. ఇలా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో చిత్ర విచిత్రాలుజరుగుతున్నాయి. మరి ఈ గొడవలు ఎంత వరకూ వెళ్తాయో చూడాలి. 

click me!