మాజీ మంత్రి అనిల్ విందు రాజకీయం... నెల్లూరు మైనారిటీ నేతలతో మాటా మంతి

Aug 11, 2022, 4:49 PM IST

నెల్లూరు : మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నాయకులకు విందు ఏర్పాటుచేసారు. నెల్లూరులోని ఇస్కాన్ సిటీలోని ఎమ్మెల్యే ఇంట్లో ఈ విందు కార్యక్రమం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యే అనిల్ మైనారిటీ నాయకులతో కలిసి ఒకే టేబుల్ పై భోజనం చేసారు. భోజనం సమయంలో  మైనారిటీ నాయకులతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు అనిల్. ఈ విందులో నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, విజయ డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డితో పాటు మరికొందరు వైసిపి నాయకులు పాల్గొన్నారు.